దేశ వ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్ష పత్రాల లీకేజీ విషయంలో.. దేశవ్యాప్తంగా ఉన్న యువతను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున పోరాటం చేసింది కాక్రోచ్ జనతా పార్టీ. దాదాపు వారం రోజులుగా ఈ ఫైట్ జరుగుతోంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ నిరసనలు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. మోడీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పటికి వస్తున్నాయి. ఇక చేసేదేమీ లేక కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా కూడా చేయించారు. ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ ఆదేశాల మేరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది.
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ( Union Education Minister Dharmendra Pradhan ) చేసిన నేపథ్యంలో మహేంద్రసింగ్ ధోని పేరు తెరపైకి వచ్చింది. ఆయన కారణంగానే కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ కారణంగానే కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిగివచ్చి రాజీనామా చేసి… నిరుద్యోగులకు సలాం కొట్టాడని వెల్లడిస్తున్నారు. అయితే ధోని పేరు తెరపైకి రావడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. జులై 25వ తేదీన కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో 2+5 కలిపితే 7 వస్తుంది. ఇది మహేంద్ర సింగ్ ధోని జెర్సీ నెంబర్.
Also Read: ఆ పాకిస్తాన్ వెధవను వద్దని మొత్తుకున్నా, కావ్యనే వినలేదు.. SRH కోచ్ సీరియస్
అలాగే మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు కూడా ఏడవ తేదీ. దీంతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ( Union Education Minister Dharmendra Pradhan) రాజీనామా చేయడం వెనుక మహేందర్ సింగ్ ధోని ఉన్నాడని అతని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. క్రికెట్ రంగంలో ఎలాంటి సంఘటన జరిగినా మహేంద్ర సింగ్ ధోనికి అంటగట్టడం అతని అభిమానులకు అలవాటైపోయింది. టీమిండియా మ్యాచ్ గెలిచినా, ఓటమిపాలైనా… ధోనీకి అంటగడుతూ తలాఫర్ రీజన్ అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంఘటనను కూడా ధోని అభిమానులు వాడుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహించాల్సిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. కేంద్ర విద్యా శాఖ వైఫల్యం కారణంగానే ఈ సంఘటన జరిగింది. దీంతో మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఒక్కటే కాదు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పేపర్లు లీక్ అయ్యాయి. దీని నిరసిస్తూ కాక్రోచ్ పార్టీ ఢిల్లీలో ధర్నాకు దిగింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
Also Read: 6, 6, 6, 6 వైభవ్ సిక్సుల వర్షం..A సింబల్ చూపిస్తూ సెలబ్రేషన్స్, టీమిండియా విజయం