E-Paper
Advertisement

Pakistan: పాకిస్తాన్ పరువు పాయె… ఇవి గ్రౌండ్స్ కాదు స్విమ్మింగ్ ఫూల్స్ ?

Pakistan: పాకిస్తాన్ పరువు పాయె… ఇవి గ్రౌండ్స్ కాదు స్విమ్మింగ్ ఫూల్స్ ?
Advertisement
Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్  ( Champions Trophy 2025 Tournament ) నేపథ్యంలో… పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న మ్యాచులన్నీ వర్షం కారణంగా రద్దు అవుతున్నాయి. ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు కూడా వర్షం కారణంగా రద్దు అయ్యాయి. దీనివల్ల సెమీఫైనల్ జట్లు ఎవరు అనే దానిపైన సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా గ్రూపు బి లో ఉన్న జట్లు.. సెమీ ఫైనల్ కు వెళ్లే ముందే వర్షం పడింది. దీంతో… గ్రూపు బీ లో సెమీఫైనల్ కోసం మూడు జట్లు తలపడుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరిగిన తర్వాత…. అసలు సెమీ ఫైనల్ కు వెళ్లే రెండు జట్లు ఏవి అనేవి తేలిపోతుంది.

ఇది ఇలా ఉండగా… ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ దేశంలో జరుగుతున్న నేపథ్యంలో.. నిన్న లాహోర్లోని గడాఫీ స్టేడియంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన కీలక వన్డే మ్యాచ్ రద్దు కావడం జరిగింది. మధ్యాహ్నం పూట వాతావరణం అనుకూలించినప్పటికీ… ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసే సమయంలోనే వర్షం బీభత్సంగా కొట్టింది. ఈ తరుణంలో లాహోర్లోని స్టేడియం మొత్తం… వరద నీటితో నిండిపోయింది. అక్కడ సరైన టెక్నాలజీ లేకపోవడంతో.. అవుట్ ఫీల్డ్ ను వెంటనే రెడీ చేయలేకపోయింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. పడిన వర్షం అలాగే అవుట్ ఫీల్డ్ లో నిలిచిపోయింది. వర్షం దంచి కొట్టడం.. అక్కడ అధునాతన సౌకర్యాలు లేకపోవడం… ఇలా రకరకాల కారణాలవల్ల మొత్తం మూడు మ్యాచులు వర్షార్పణం అయ్యాయి. దీంతో గ్రూప్ బి లో ఏ జట్టు సెమీఫైనల్ వెళ్తుందో ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఆస్ట్రేలియా అయితే అధికారికంగా వెళ్ళినప్పటికీ మిగతా రెండు జట్లు మాత్రం పోటీ పడుతున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ లాహోర్ స్టేడియంలో ( Lahore stadium )… పనిచేసే స్టేడియం వర్కర్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్.. గా మారడం జరిగింది. వర్షపు నీటిని బయటికి పంపించే ప్రయత్నంలో… గ్రౌండ్ మైన్లు… చాలా కష్టపడ్డారు. ఎంతో కష్టపడి వర్షం నీటిని బయటికి పంపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ తరుణంలోనే ఓ గ్రౌండ్ మాన్…. జారిపడ్డాడు. అలా జారి పడినప్పటికీ మ్యాచ్ కోసం… పైకి లేచి మళ్లీ వరద నీటిని పంపించే ప్రయత్నం చేశాడు. చాలా డెడికేషన్ తో వర్క్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

అటు.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పైన కూడా సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది. వర్షం పడితే గ్రౌండ్లను సిద్ధం చేయలేని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ఛాంపియన్స్ ట్రోఫీ అవసరమా అంటూ సెటైర్లు పెంచుతున్నారు ఇండియన్ ఫ్యాన్స్. ఒక ఐసీసీ టోర్నమెంట్ లో మూడు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు అవుతాయా? ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా చూశారా? కేవలం పాకిస్తాన్లోనే చూస్తామని కామెంట్స్ చేస్తున్నారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు తీసేలా సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా పెడుతున్నారు.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×