E-Paper
Advertisement

Paralympics 2024: ఒక్కరోజే ఐదు పతకాలు.. పారాలింపిక్స్‌లో భారత్ హవా!

Paralympics 2024: ఒక్కరోజే ఐదు పతకాలు.. పారాలింపిక్స్‌లో భారత్ హవా!

Paralympics 2024 India Number of medals: పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. సోమవారం ఒక్కరోజే ఐదు పతకాలు సాధించి రికార్డు నెలకొల్పారు. ఈ పతకాల్లో ఒకటి గోల్డ్, రెండు సిల్వర్, రెండు బ్రాంజ్ ఉన్నాయి.

బ్యాడ్మింటన్ ప్లేయర్ నితేశ్ కుమార్ భారత్ కు మరో గోల్డ్ అందించారు. సోమవారం జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్ 3 లో నితేశ్ కుమార్ బంగారు పతకం గెలిచాడు. తొలిసారి పారా ఒలింపిక్స్ ఆడుతున్న నితేశ్.. ఫైనల్‌లో 21-14, 18-21,23-21 తేడాతో బ్రిటన్ కు చెందిన డానియల్ బెతెల్ ను ఓడించాడు.

కాగా, అంతకుముందు షూటర్ అవని లేఖరా గోల్డ్ మెడల్ గెలిచిన సంగతి తెలిసిందే. తాజాగా, నితేశ్ కుమార్ బంగారు పతకం సాధించడంతో భారత్ కు రెండు గోల్డ్ మెడల్ వచ్చినట్లయింది.

అలాగే, పురుషుల డిస్కస్ త్రో ఎఫ్ 56 లో యోగేశ్ కుతునియా సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్ 4 విభాగం ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ ఆటగాడు మజుర్ చేతితో ఎస్ఎల్ యతి రాజ్ ఓటమి చెందడంతో సిల్వర్ మెడల్ వరించింది.

Also Read: పాకిస్తాన్ కు.. మరో అవమానం తప్పదా?

మహిళల సింగిల్స్ ఎస్‌యూ 5 ఫైనల్ మ్యాచ్ లో తులసిమతి మురుగేశన్ రజతం, మనీషా రామ్ దాస్ కాంస్యం పతకాలు సాధించారు. దీంతో పారా ఒలింపిక్స్ లో భారత్ కు వచ్చిన పతకాల సంఖ్య 12కు చేరింది.

 

 

 

Related News

బుమ్రా బౌలింగ్ లో ఆడ‌టం నా వ‌ల్ల కాదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

Liam Livingstone: ఐపీఎల్ ప‌ర‌మ బోరింగ్ లీగ్..ప‌రువు తీసిన‌ SRH ప్లేయర్‌

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

Big Stories

×