BigTV English

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ తొలి పతకం సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్ కాంస్య పతకాన్ని గెలిచింది. 221.7 పాయింట్ల తేడాతో బాకర్ మూడో స్థానంలో నిలిచింది. దీంతో ఒలింపిక్స్ లో షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా మను బాకర్ రికార్డు సృష్టించింది. ఇద్దరు కొరియన్ అథ్లెట్స్ స్వర్ణం, రజతం పతకాలు సాధించారు.


మరోవైపు.. పురుషుల 10మీ ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో అర్జున్ బబుతా అదరగొట్టేశాడు. 630.1 స్కోర్‌తో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు క్వాలిఫై అయ్యాడు. ఇదే విభాగంలో మరో భారత షూటర్ సందీప్ సింగ్ 629.3 స్కోర్ సాధించి 12వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. అయితే, పురుషుల 10మీ ఎయిర్ పిస్టల్ ఫైనల్ సోమవారం మ.3.30 గంటలకు ప్రారంభంకానున్నది.

Also Read: ఒలింపిక్స్ దుస్తులు నాసిరకంగా ఉన్నాయి: గుత్తా జ్వాలా


ఇది ఇలా ఉంటే.. మను బాకర్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మనుబాకర్ విజయం ఇతర క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని ప్రశంసించారు. బాకర్ భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకోవాలంటూ ఆకాంక్షించారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×