E-Paper
Advertisement

IPL : సికందర్ రజా, షారుక్ అదుర్స్.. లక్నోకు పంజాబ్ షాక్..

IPL : సికందర్ రజా, షారుక్ అదుర్స్.. లక్నోకు పంజాబ్ షాక్..
Advertisement

IPL : ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. లక్నో, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా చివరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగింది. షారుక్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ తో పంజాబ్ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ ( 74, 56 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సు) ఒంటరి పోరాటం చేశాడు. ఓపెనర్ కైల్ మేయర్స్ ( 29, 23 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులు ) మెరుపులు ఎక్కువ సేపు కొనసాగలేదు. ఆ తర్వాత బ్యాటర్లు ఎవరూ మంచి ఇన్నింగ్స్ ఆడలేదు.

దీపక్ హుడా (2), నికోలక్ పూరన్ (గోల్డెన్ డక్ ) తీవ్రంగా నిరాశపర్చారు. కృనాల్ పాండ్యా ( 18), మార్కస్ స్టొయినిస్ (15) కాసేపు నిలబడినా భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. దీంతో పంజాబ్ ముందు 160 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే లక్నో ఉంచగలిగింది. పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ 3 వికెట్లు, రబడా రెండు వికెట్లు, అర్ష్ దీప్ సింగ్, హర్ ప్రీత్ బ్రార్, సికందర్ రజా తలో వికెట్ తీశారు.

Advertisement

కెప్టెన్ థావన్ అందుబాటులో లేకపోవడంతో ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టుకు సామ్ కరన్ నాయకత్వం వహించాడు. పంజాబ్ పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ అథర్వ వికెట్ ను కోల్పోయింది. ప్రభ్ సిమ్రాన్ సింగ్ (4) వెంటనే అవుట్ అయ్యాడు. ఈ దశలో మథ్యూ షార్ట్ ( 34 , 22 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సు ) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హర్ ప్రీత్ సింగ్ (22) ఫర్యాలేదనించాడు. వీళ్లిద్దరూ అవుటైన తర్వాత సికందర్ రజా (57, 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు) అదరగొట్టాడు. పంజాబ్ విజయానికి 21 పరుగులు దూరంలో ఉండగా సికందర్ రజా అవుట్ కావడంతో మ్యాచ్ పై ఉత్కంఠ రేగింది.

పంజాబ్ గెలవాలంటే చివరి 2 ఓవర్లలో 20 పరుగులు చేయాలి. షారుక్ ఖాన్ మెరుపులతో 19 ఓవర్ లో 13 పరుగులు వచ్చాయి. దీంతో చివరి ఓవర్ లో 7 పరుగులు అవసరమయ్యాయి. షారుక్ ఖాన్ ( 23, 10 బంతుల్లో 1 ఫోర్ , 2 సిక్సులు ) తొలి రెండు బంతుల్లో రెండేసి పరుగులు తీశాడు. మూడో బంతికి బౌండరీ కొట్టి పంజాబ్ ను విజయతీరాలకు చేర్చాడు. లక్నో బౌలర్లలో యుధ్ వీర్ సింగ్, మార్క్ ఉడ్ , రవి బిష్టోయ్ రెండేసి వికెట్లు తీశారు. కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు.

Advertisement

హాఫ్ సెంచరీతో పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన సికందర్ రజా కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ లో ఓడినా లక్నో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు మొత్తం 5 మ్యాచ్ ల్లో 3 విజయాలు సాధించింది. మరో రెండు మ్యాచ్ ల్లో ఓడింది. పంజాబ్ 5 మ్యాచ్ ల్లో 3 విజయాలు, 2 ఓటములతో పాయింట్ల పట్టికలో 4 స్థానంలో ఉంది.

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×