E-Paper
Advertisement

RCB ప్లేయ‌ర్ అసభ్య‌క‌ర సైగ‌లు.. వైసీపీ వర్సెస్‌ టీడీపీ మ‌ధ్య సోష‌ల్ మీడియా వార్

RCB ప్లేయ‌ర్ అసభ్య‌క‌ర సైగ‌లు.. వైసీపీ వర్సెస్‌ టీడీపీ మ‌ధ్య సోష‌ల్ మీడియా వార్

YCP VS TDP:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament)  నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో దూసుకు వెళ్తోంది. గత సీజన్ లో టైటిల్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు… ఈసారి ఆడిన రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి అదరగొడుతోంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ పైన మ్యాచ్ గెలిచిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు అలాగే అభిమానులు ఓవర్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను కించపరిచేలా వ్యవహరించారు. ఇక లేటెస్ట్ గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు రొమారియో షెపర్డ్ ( Romario Shepherd ) అసభ్యకరమైన సైగలు చేశాడు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో వైసీపీ ( YCP), టీడీపీ ( TDP) మధ్య వార్ మొదలైంది.

Also Read: Shardul Thakur overthrow: శార్దూల్ ఠాకూర్ ఓవర్‌త్రో వివాదం..4 ప‌రుగులు కూడా వ‌ద‌ల‌లేదు, ముంబై, ఢిల్లీ మ్యాచ్ లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం !

RCB ప్లేయ‌ర్ అసభ్య‌క‌ర సైగ‌లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఇందులో 43 పరుగులు తేడాతో బెంగళూరు విజయం సాధించింది. అయితే ఈ విజయం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను కించపరిచేలా సెలబ్రేషన్స్ చేసుకున్నారు బెంగళూరు ఫ్యాన్స్. ఇక లేటెస్ట్ గా డ్రెస్సింగ్ రూమ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించిన ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్ అసభ్యకరమైన సెలబ్రేషన్స్ చేసుకున్నారు. చెన్నై బౌలర్లను, టిమ్ డేవిడ్ చీల్చి చెండాడాడని చెప్పే ప్రయత్నంలో భాగంగా తన చేతితో అసభ్యకరమైన సైగలు చేశాడు. ఈ వీడియో బయటకు వచ్చింది. దీంతో ఓ వైసీపీ అభిమాని, రొమారియో షెపర్డ్ ను తిడుతూ పోస్ట్ పెట్టాడు. ఒక్క టైటిల్ గెలిచి 11 మందిని చంపిన మీరు, ఇంత ఓవ‌రాక్ష‌న్ చేయడం అవ‌స‌ర‌మా ? అంటూ ఫైర్ అయ్యారు.

వైసీపీ వర్సెస్‌ టీడీపీ మ‌ధ్య సోష‌ల్ మీడియా వార్

చెన్నై సూపర్ కింగ్స్ పై ఒక్క విజయంతో మ‌రో టైటిల్ గెలిచినంత ఫీల్ అవుతున్నారు… అంత బలుపు ఎందుకు అంటూ మండిపడ్డారు. ఈ మేరకు రొమారియో షెపర్డ్ ను తిడుతూ అసభ్యకరమైన ప‌ద‌జాలంతో పోస్టు పెట్టాడు వైసీపీ అభిమాని. అయితే దీనికి టిడిపి కార్యకర్తలు కౌంటర్ ఇస్తున్నారు. 11 మంది ఆర్సీబీ అభిమానుల చావు గురించి మాట్లాడుతున్న వైసీపీ..వాళ్లు గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల గురించి కూడా స్పందించాల‌ని కౌంటర్ ఇస్తున్నారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో గెలిచిన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీకి రాకుండా ఏపీ ప్ర‌జ‌ల‌కు ఏం న్యాయం చేస్తున్నారో చెప్పాలి అంటూ ఫైర్ అవుతున్నారు టీడీపీ కార్య‌క‌ర్త‌లు. ముందుగా మీరు స‌రిగ్గా ఉండి నీతులు చెప్పండి అంటూ ఆడుకుంటున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ మ‌ధ్య సోష‌ల్ మీడియా వార్ మొద‌లైంది.

 

 

Also Read:  Tanveer Ahmed On MI: ఇంకా ఎన్ని అవ‌మానాలు భ‌రిస్తావ్..ముంబైని వ‌దిలి PSLలోకి వ‌చ్చేసేయ్‌.. రోహిత్ శ‌ర్మ‌పై త‌న్వీర్ సంచ‌ల‌నం

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×