BigTV English

Rishabh Pant – MLC : రిషబ్ పంత్ ఒక్క మ్యాచ్ కు 1.9 కోట్లు..MLC లీగ్ లో అందరూ ఆడిన కూడా అన్ని డబ్బులు రావు

Rishabh Pant – MLC : రిషబ్ పంత్ ఒక్క మ్యాచ్ కు 1.9 కోట్లు..MLC లీగ్ లో అందరూ ఆడిన కూడా అన్ని డబ్బులు రావు

Rishabh Pant – MLC : టీమిండియా కీలక ఆటగాడు రిషబ్ పంత్ 18వ ఐపీఎల్ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ సీజన్  ప్రారంభంలో రిషబ్ పంత్ పేలవ ప్రదర్శన చేశాడు. చివరి రెండు మ్యాచ్ ల్లో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఇక చివరి మ్యాచ్ లో మాత్రం సెంచరీ సాధించాడు. అయినప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛేజింగ్ చేసి టాప్ 2లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. టాప్ 2నే కాదు.. ఏకంగా ఐపీఎల్ 2025 ట్రోఫీని కూడా దక్కించుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే రిషబ్ పంత్ గురించి ఐపీఎల్ మ్యాచ్ సమయంలో కూడా ఓ వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ జట్టు యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. రిషబ్ పంత్ మాత్రం ఒక్కో మ్యాచ్ కి రూ.1.9 కోట్లు తీసుకొని పేలవ ప్రదర్శన చేయడం విశేషం.


Also Read :  Watch Video : మన్కడింగ్ చేయకుండా రౌడీయిజం.. ఇదెక్కడి క్రికెట్ నాయనా

తాజాగా మేజర్ లీగ్ క్రికెట్ (MLC) జరుగుతోంది. ఇవాళే ప్రారంభం అయింది. మేజర్ లీగ్ క్రికెట్ జూన్ 12, 2025 నుంచి జూలై 14, 2025 వరకు జరుగుతోంది. ఐపీఎల్ తరువాత మరో యాక్షన్ ప్యాక్ట్ సీజన్ కి సిద్ధమవుతున్నందున మరోసారి ఉత్కంఠ పెరుగుతోంది. ఆరు జట్లు డబుల్ రౌండ్-రాబిన్ ఫార్మాట్ లో ఢీ కొంటాయి. లీగ్ దశ,  ప్లే ఆప్స్, ఫైనల్ అన్ని కలిపి దాదాపు నెల రోజుల పాటు జరుగుతోంది. ఇక ఈ టోర్నమెంట్ మొత్తం కేవలం మూడు ప్రధాన వేదికల్లోనే జరుగుతుంది. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ కొలీజియం, టెక్స్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియం, ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ స్టేడియంలో మ్యాచ్ లు జరుగుతాయి. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. ఐపీఎల్ లో రిషబ్ పంత్ ఒక్కడే ఒక్క మ్యాచ్ కు రూ.1.9కోట్లు తీసుకున్నాడు. కానీ MLC లీగ్ లో మాత్రం అందరూ ఆడినా కానీ అన్ని డబ్బులు రావు అని ఓ వార్త వైరల్ కావడం విశేషం. లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ కూడా ఇటీవల వైభవ్ సూర్యవంశీ ని కలిసి రిపబ్ పంత్ కంటే నువ్వే అద్భుతంగా ఆడుతున్నావని.. అతనికీ డబ్బులు వేస్ట్ అని కూడా చెప్పినట్టు వార్తలు వినిపించిన విషయం విధితమే.


ఐపీఎల్ లో రిషబ్ పంత్ కొన్ని ఇన్నింగ్స్ లో డకౌట్, సింగిల్ డిజిట్స్ కే పరిమితమయ్యాడు. చివర్లో మాత్రం పుంజుకున్నారు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు వచ్చే సీజన్ లో అసలు రిషబ్ పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కెప్టెన్ గా ఉంచుకుంటుందా..? లేక మరెవ్వరినైనా కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇస్తుందా..? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రిషబ్ పంత్ నే LSG కొనసాగిస్తుందని కొందరూ అంటుంటే.. మళ్లీ అంత అమౌంట్ చెల్లించడం వృధా అని కొందరూ పేర్కొనట్టు తెలుస్తోంది. మొత్తానికి ఐపీఎల్ తో పోల్చితే.. MLC లీగ్ లో ఆటగాళ్లకు ఇచ్చే అమౌంట్ చాలా తక్కువ అని స్పష్టంగా అర్థమవుతోంది. 

Related News

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

IND Vs PAK : టీమిండియా ఫ్యాన్స్ కు పాకిస్థాన్ ఆట‌గాడు ఆటోగ్రాఫ్‌…!

BCCI : బీసీసీఐలో ప్ర‌క్షాళ‌న‌..కొత్త అధ్య‌క్షుడు ఇత‌నే.. ఐపీఎల్ కు కొత్త బాస్

Big Stories

×