E-Paper
Advertisement

Shahid Afridi: రూ.ల‌క్ష ముఖాన కొడ‌తా, RCBని నాకివ్వండి…ప‌రువు తీసిన షాహిద్ ఆఫ్రీది

Shahid Afridi: రూ.ల‌క్ష ముఖాన కొడ‌తా, RCBని నాకివ్వండి…ప‌రువు తీసిన షాహిద్ ఆఫ్రీది
Advertisement

Shahid Afridi:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore) జట్టుకు కొత్త ఓనర్ వచ్చేశారు. ఈ బెంగుళూరు జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ తో ( Aditya Birla Group) పాటు మరో మూడు సంస్థలు కొనుగోలు చేశాయి. దాదాపు రూ.16,700 కోట్లు పెట్టి, డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేశాయి. అయితే ఈ సేల్ పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi) స్పందించారు. బెంగళూరు జట్టుకు భారీ ధర వచ్చిన నేపథ్యంలో ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు లక్ష రూపాయలు ఎక్కువ అంటూ సెటైర్లు పేల్చారు. ఇప్పుడే జేబులో నుంచి లక్ష రూపాయలు ముఖాన కొడతా.. వెంటనే బెంగళూరు జట్టును తనకు విక్రయించాలని దారుణంగా కామెంట్లు చేశారు. దీంతో షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Shoaib Akhtar On PSL: అమ్మాయి-అబ్బాయి లేకుండా పెళ్లి చేస్తారా ? అభిమానుల‌ను నిషేధించ‌డంపై షోయ‌బ్ అక్త‌ర్ సీరియ‌స్

రూ.ల‌క్ష ముఖాన కొడ‌తా, RCBని నాకివ్వండి

Advertisement

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ భారీ ధరకు కొనుగోలు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi) దారుణంగా ట్రోలింగ్ చేశాడు. 16 వేల కోట్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ కొనుగోలు చేస్తే, కేవలం 16 వేల రూపాయలకు కొన్నారా ? అంటూ లెక్కలు తెలియకుండా మాట్లాడారు షాహిద్ ఆఫ్రీది. విరాట్ కోహ్లీ లాంటి పెద్ద ప్లేయర్లు ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 16 వేలు మాత్రమే పలికిందా ? అంటూ సెటైర్లు పేల్చారు.

తనకు చెప్పి ఉంటే లక్ష రూపాయలు ముఖాన కొట్టేవాడిని.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును సొంతం చేసుకునే వాడిని అంటూ ర్యాగింగ్ చేశారు. బెంగళూరు జట్టుకు ఇంత తక్కువ ధర పలకడం దారుణం అంటూ షాహిద్ ఆఫ్రీది వ్యాఖ్యానించారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అయితే షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్యలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. కోట్లకు వేలకు తేడా తెలియకుండా షాహిద్ ఆఫ్రీది మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. ముందుగా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ను చక్కదిద్దుకో, అనవసరంగా ఐపిఎల్ లో వేలు పెట్టకు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు బెంగళూరు అభిమానులు.

ఆర్సీబీని ఎవ‌రు కొనుగోలు చేశారంటే ?

Advertisement

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore) జట్టు ఆదిత్య బిర్లా గ్రూప్ మెజారిటీ షేర్లు కొనుగోలు చేసింది. దీంతో ఆదిత్య బిర్లా గ్రూప్ ఓన‌ర్ ఆర్యమాన్ బిర్లా ఆర్సీబీ జ‌ట్టుకు ఛైర్మన్‌గా మార‌బోతున్నారు. అటు TOI గ్రూప్ (సత్యన్ గజ్వానీ ), బ్లాక్‌స్టోన్ (ప్రపంచ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం),
డేవిడ్ బ్లిట్జర్ (బోల్ట్ వెంచర్స్) స‌హ య‌జ‌మానులుగా కొన‌సాగుతారు.

Also Read: Suryakumar-chewing gums: ఒక్క రోజుకు 500 చూయింగ్ గ‌మ్స్..సూర్య కుమార్ కోసం బీసీసీఐ ఎన్ని ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తోందంటే ?

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×