E-Paper
Advertisement

Shahid Afridi: జై షా చేతుల మీదుగా టి20 ప్రపంచ కప్ టైటిల్ తీసుకోబోం…అంద‌రి ముందే ఇండియాను అవమానిస్తాం

Shahid Afridi:  జై షా చేతుల మీదుగా టి20 ప్రపంచ కప్ టైటిల్ తీసుకోబోం…అంద‌రి ముందే ఇండియాను అవమానిస్తాం

Shahid Afridi: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే బంగ్లాదేశ్ అలాగే ఇండియా మధ్య గ్యాప్ పెరిగిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు షాహిద్ ఆఫ్రీది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ విజేతగా పాకిస్తాన్ నిలువబోతుందని ఇప్పుడే పేర్కొన్నాడు షాహిద్ ఆఫ్రీది. అంతేకాదు ఈ టైటిల్ గెలిచిన తర్వాత ఐసీసీ బాస్ జై షా చేతుల మీదుగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా తీసుకోబోడని.. గతంలో సూర్య కుమార్ యాదవ్ చేసినట్లుగానే మావోడు కూడా చేస్తాడని బాంబు పేల్చాడు షాహిద్ ఆఫ్రీది. దీంతో షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

Also Read: T20 World Cup 2026: ఇండియ‌న్ ఏజెంట్ కామెంట్స్‌..BCBపై బంగ్లా క్రికెట‌ర్ల తిరుగుబాటు, వాడు రాజీనామా చేయాలంటూ

టైటిల్ తీసుకోకుండా ఇండియాను అవమానిస్తాం – షాహిద్ ఆఫ్రీది

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ విజేతగా పాకిస్తాన్ నిలువబోతుందని మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది సంచలన ప్రకటన చేశారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ టోర్నమెంట్లో ఇండియాను గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ టైటిల్ గెలిచిన తర్వాత ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న జై షా చేతుల మీదుగా ట్రోఫీ అందుకోబోమని.. అది వాళ్ళ ముఖాన కొట్టేసి వెళ్ళిపోతామని షాహిద్ ఆఫ్రీది బలుపు మాటలు మాట్లాడారు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సీన్ న‌ఖ్వీ ని టీమిండియా టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అవమానించిన తరహాలోనే మేము కూడా ఐసీసీ బాస్ జై షా ను ఇంకా దారుణంగా అవమానిస్తామని హెచ్చరించాడు. అయితే షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్యలను పద్యంలో అతన్ని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్. అరే మీరు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ గెలుచుకోండి.. గెలిచిన తర్వాత ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వండి… గ్రూప్ స్టేజ్ లోనే మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తాం అంటూ క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఇంతకీ పాకిస్తాన్ ను సూర్య భాయ్ ఎలా అవమానించాడంటే ?

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సందర్భంగా పాకిస్తాన్ దేశాన్ని దారుణంగా అవమానించాడు సూర్య కుమార్ యాదవ్. టి20 ఫార్మాట్ లో జరిగిన ఆసియా కప్ 2025 టోర్నమెంటును టీమిండియా గెలుచుకుంది. ఆ సమయంలో టీమిండియా కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ ఉన్నాడు. అయితే రూల్స్ ప్రకారం ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ను ఏసీసీ చైర్మన్ గా ఉన్న పాకిస్తాన్ వ్యక్తి నఖ్వీ టైటిల్ ఇవ్వాలి. అయితే ఆపరేషన్ సింధూర్ సంఘటన నేపథ్యంలో అతని చేతుల మీదుగా తాను టైటిల్ అందుకోనని… తిరిగి వచ్చేసాడు సూర్య కుమార్ యాదవ్. దీంతో పాకిస్తాన్ పరువు దారుణంగా పోయింది. ఇప్పుడు అదే తరహాలో ఇండియా పరువు తీస్తామని ఆఫ్రిది వార్నింగ్ ఇచ్చాడు.

Also Read: Harleen doel Retire Out: రీల్స్ పాప హర్లీన్ డియోల్ కు ఘోర అవ‌మానం..యూపీ కొంప‌ముంచిన‌ “రిటైర్ట్ ఔట్”

 

?igsh=MW93MGIxbXc0NTZjaA==

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×