Shahid Afridi On Pakistan Womens Team : పాకిస్తాన్ మహిళల జట్టు (Pakistan Womens Team) పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. మొన్న టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా గ్రూప్ స్టేజి లోనే పాకిస్తాన్ మహిళల జట్టు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ ఫినిష్ అయిన తర్వాత శ్రీలంకలో అడుగు పెట్టింది పాకిస్తాన్. ఈ సందర్భంగా జరిగిన వన్డేలు, టి20లో చిత్తుగా ఓడిపోయింది. రెండు సిరీస్ లను కూడా కోల్పోయింది పాకిస్తాన్ మహిళల జట్టు. ఈ క్రమంలో పాకిస్తాన్ హెడ్ కోచ్ గా ఉన్న వహాబ్ రియాజ్ పైన (WAHAB RIAZ) తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అతని వల్లే పాకిస్తాన్ మహిళల జట్టు చెత్తగా తయారైందని… అలాంటోడిని తప్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
టి20 మహిళల ప్రపంచకప్, శ్రీలంక గడ్డపై పాకిస్తాన్ మహిళల జట్టు అట్టర్ ప్లాప్ అయిన నేపథ్యంలో మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వహాబ్ రియాజ్ ను ఉద్దేశించి రేంజ్ లో రెచ్చిపోయారు. నీకు చేతకాకపోతే… గాజులు వేసుకొని మూలన కూర్చో అంటూ ఆగ్రహించారు. పాకిస్తాన్ మహిళల జట్టును తనకు అప్పగిస్తే… మంచి ఫలితాలు రాబడతానని స్టేట్మెంట్ ఇచ్చారు. అనవసరంగా వహాబ్ రియాజ్ కు బాధ్యతలు ఇచ్చి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తప్పిదం చేసిందని ఫైర్ అయ్యారు షాహిద్ అఫ్రిది. వీడికి జింబాబ్వే పైన తప్ప… శ్రీలంక, టి20 ప్రపంచ కప్ లలో పాకిస్తాన్ జట్టును గెలిపించడం చేతకాదని హేళన చేస్తూ మాట్లాడారు.
ఉన్న ఫలంగా వహాబ్ రియాజ్ ను మెడలు పట్టుకుని గెంటేయాలని డిమాండ్ చేశారు. ఇలాగే వహాబ్ రియాజ్ కొనసాగితే.. పాకిస్తాన్ మహిళల క్రికెట్ ను ఎవరు చూడబోరని.. ఆ జట్టును రద్దు చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అవకాశం ఉంటే, తనకు పాకిస్తాన్ మహిళల జట్టును అప్పగించాలని.. డిమాండ్ చేశారు షాహిద్ అఫ్రిది. తనకు కోచ్ బాధ్యతలు అప్పగిస్తే, పాకిస్తాన్ మహిళల జట్టు (Pakistan Womens Team)ను వరల్డ్ నెంబర్ వన్ చేస్తానని ప్రకటించారు.
పాకిస్తాన్ పురుషుల జట్టు తరహాలోనే…. మహిళలు కూడా తయారయ్యారు. టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి మొదలుకొని.. వరుసగా ఓటమి పాలవుతోంది పాకిస్తాన్. మొదటి వరల్డ్ కప్ లో గ్రూప్ లోనే ఎలిమినేట్ కావడమే కాకుండా.. టీమిండియా మహిళల జట్టు చేతిలో దారుణంగా ఓడిపోయింది. శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్, లేటెస్ట్ గా టి20 సిరీస్ కూడా దాదాపు పోగొట్టుకుంది. దీంతో ఆ జట్టును రద్దు చేయాలని కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.