E-Paper
Advertisement

Shreyas Iyer : శ్రేయాస్ అయ్యర్ కు ఘోర అవమానం.. IPL 2026 టోర్నమెంట్ కు దూరం!

Shreyas Iyer : శ్రేయాస్ అయ్యర్ కు ఘోర అవమానం.. IPL 2026 టోర్నమెంట్ కు దూరం!

Shreyas Iyer : టీమిండియా క్రికెట‌ర్ శ్రేయాస్ అయ్య‌ర్ గురించి దాదాపు అంద‌రికీ తెలిసిందే. ఇటీవ‌లే అయ్య‌ర్ ఆస్ట్రేలియాతో జ‌రిగిన వ‌న్డే సిరీస్ లో గాయపడిన విష‌యం తెలిసిందే. అయితే శ్రేయాస్ అయ్యర్‌కు ఆ గాయం నుంచి కోలుకోవడానికి కనీసం రెండు నెలలు అయినా పట్టనుంది. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న అయ్యర్‌కు ప్రస్తుతం సాధారణ పనులు, చిన్నపాటి వ్యాయామాలకు అనుమతి లభించింది. స్ప్లీన్‌పై ఒత్తిడి పెంచే పనులు చేయరాదని సూచించారు. మరో రెండు నెలల తర్వాత యూఎస్జీ స్కాన్ అనంతరం రిహాబిలిటేషన్ ప్రారంభమవుతుంది. దీంతో రానున్న దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లకు శ్రేయాస్ అయ్యర్ దూరంగా ఉండనున్నాడు. అలాగే ఐపీఎల్ ప్రారంభంలో అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న శ్రేయ‌స్ అయ్యార్.. కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

Also Read : Aus vs Eng Ashes 2025-26 : సెంచరీతో రెచ్చిపోయిన హెడ్.. మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం.. 2 రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్స్కాన్‌లో గాయం

స్కాన్‌లో గాయం

సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అయ్యర్ నేలను బలంగా గుద్దుకున్నాడు. దీంతో అంతర్గత రక్తస్రావం కావడంతో ఐసీయూలో ఉంచి ఆ తర్వాత డిశ్చార్జ్ చేశారు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత నుంచి అయ్యర్‌పై వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇటీవల అతనికి అల్ట్రాసోనోగ్రఫీ స్కాన్ చేయించగా, ఆ రిపోర్టులను ప్రఖ్యాత క్రీడా వైద్య నిపుణుడు డాక్టర్ దిన్షా పెర్డి‌వాలా పరిశీలించారు. స్కాన్‌లో గాయం మానుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ సాధారణంగా అతని పనులు అతను చేసుకోవడానికి, చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవడానికి ప్రస్తుతం వైద్యులు అనుమతి ఇచ్చారు. అయితే స్ప్లీన్‌పై ఒత్తిడి పెరిగేలా చేసే ఏ పనులు చేయకూడదని కఠినంగా సూచించారు.

మళ్లీ యూఎస్జీ స్కాన్

అయ్యర్‌కు మరో రెండు నెలల తర్వాత మళ్లీ యూఎస్జీ స్కాన్ చేయనున్నారు. ఆ రిపోర్టులు సాధారణంగా వచ్చిన తర్వాతే అతడిని బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఫార్మల్ రిహాబిలిటేషన్ కోసం అనుమతించనున్నారు. ఈ లెక్కన చూసుకుంటే మరో రెండు నుంచి మూడు నెలల పాటు శ్రేయాస్ అయ్యర్ క్రికెట్‌కు దూరంగా ఉండాల్సిందేనని తెలుస్తోంది. దాంతో రాబోయే దక్షిణాఫ్రికాతో పాటు న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లు పూర్తిగా మిస్సవ్వడం ఖాయం. 29 ఏళ్ల శ్రేయాస్ అయ్యర్ టీమిండియా కీలక మిడిలార్డర్ బ్యాటర్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసి వాల్యుబుల్ ప్లేయర్‌గా నిలిచాడు. అయ్యర్ ఫిట్‌నెస్ కారణాలతో అటు టెస్టు, ఇటు టీ20లకు కాకుండా కేవలం వన్డే ఫార్మాట్‌లకే అతన్ని సెలెక్ట్ చేస్తున్నారు. కానీ ఆ ఒక్క ఫార్మాట్‌లో కూడా ఇలా గాయపడి క్రికెట్‌కు దూరమవుతూ వస్తున్నాడు. రానున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 నాటికి పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read : ODI in Vizag : వైజాగ్ లో సౌతాఫ్రికాతో వన్డే..రోహిత్‌, కోహ్లీ వ‌స్తున్నారు..టికెట్లు ఎప్పుడంటే

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×