BigTV English
Advertisement

Akmal brothers: పాక్ మాజీ క్రికెటర్ల ఇంట్లో దొంగలు పడ్డారు..!

Akmal brothers: పాక్ మాజీ క్రికెటర్ల ఇంట్లో దొంగలు పడ్డారు..!

Akmal brothers: పాకిస్తాన్ కి చెందిన 43 ఏళ్ల కమ్రాన్ అక్మల్, అతడి సోదరుడు ఉమర్ అక్మల్ కి చెందిన లాహోర్ లోని ఫామ్ హౌస్ లో దొంగలు పడ్డారు. పట్టపగలే ఇంట్లోకి చొరపడ్డ దొంగలు రూ. 5 లక్షల విలువ చేసే సౌర విద్యుత్ పలకలను దోచుకెళ్ళారు. అంతకు ముందు రోజే ఈ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని, ఈ సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేసి ఒక్కరోజు కూడా గడవకుండానే దొంగలు దోచేశారని కమ్రాన్ అక్మల్ {Akmal brothers} తండ్రి వాపోయారు.


 

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. ఈ ఘటన తెలిసిన క్రీడాభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పాకిస్తాన్ లో సెలబ్రిటీ {Akmal brothers} ఇళ్లకు సైతం భద్రత కొరవడిందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే లాహోర్ లోని వీరి ఫామ్ హౌస్ లో ఇలా దొంగతనం జరగడం కొత్తేమీ కాదు. 2022 జూలై నెలలో కూడా ఈ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ ఆక్మల్ ఇంట్లో దొంగలు పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంట్లో నుండి మేకను ఎత్తుకెళ్లారు.


దాని విలువ 90 వేల రూపాయలు. బక్రీద్ సందర్భంగా పేదలకు దానం ఇవ్వడానికి మేకలను కొనుగోలు చేశారు అక్మల్ కుటుంబ సభ్యులు. పండగని పురస్కరించుకొని మొత్తం ఆరు మేకలను కొనుగోలు చేసి, తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటి ఆవరణలో కట్టేశారు. ఆ తరువాత అందులో ఒకటి కనిపించడం లేదని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని {Akmal brothers} తెలిపారు. ఇలా లాహోర్ లోని అక్మల్ నివాసంలో చోరీ జరగడం ఇది రెండవసారి. ఇక కమ్రాన్ అక్మల్ పాకిస్తాన్ జాతీయ జట్టు తరఫున అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడారు.

తన కెరీర్ లో 53 టెస్టులు, 157 వన్డేలు, 58 టీ-20 మ్యాచ్ లు ఆడాడు. వికెట్ కీపర్ కం బ్యాటర్ గా పాకిస్తాన్ జట్టు విజయాలలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం డొమెస్టిక్ లీగ్ మ్యాచ్లలో పాల్గొంటున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} టోర్నిలోనూ మెరిశాడు. 2008 ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆరు మ్యాచ్లలో ఆడాడు కమ్రాన్. ఈ ఆరు మ్యాచ్లలో ఒక ఆఫ్ సెంచరీ తో సహా 128 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ స్టేజ్ లోనే టోర్నీ నుండి తప్పుకున్న పాకిస్తాన్ జట్టు.. తాజాగా కరాచీ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన టి-20 మ్యాచ్ లో సైతం ఘోర ఓటమిని చవిచూసింది.

 

ఈ ఓటమిపై కమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జింబాబ్వే – ఐర్లాండ్ మధ్య సిరీస్ జరుగుతుందని.. అక్కడికి వెళ్లి వారితో ఆడి తిరిగి దేశానికి రావాలని పాకిస్తాన్ జట్టుపై సెటైర్లు వేశాడు. వారిపై గెలిస్తేనే పాకిస్తాన్ జట్టుకు ఛాంపియన్ ట్రోఫీలో ఆడే అర్హత వస్తుందని కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా గత ఏడు సంవత్సరాలుగా తమ జట్టు ప్రదర్శన చాలా చెత్తగా ఉందని మండిపడ్డాడు.

Tags

Related News

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Hong Kong Sixes 2025: దినేష్ కార్తీక్ చెత్త కెప్టెన్సీ.. కువైట్, UAE చేతిలో వ‌రుస‌గా ఓడిన టీమిండియా

Womens World Cup 2029: వ‌చ్చే వ‌ర‌ల్డ్ క‌ప్ 2029పై ఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇకపై 8 కాదు 10 జ‌ట్లకు ఛాన్స్‌, ఫాకిస్తాన్ కు నో ఛాన్స్ !

Big Stories

×