Kulasekara praised MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (Mahendra Singh Dhoni) ఎన్నో రికార్డులు, రివార్డులు అందుకున్నాడు. 2007 సమయంలో టీమిండియా కెప్టెన్ బాధ్యతలు తీసుకున్న మహేంద్రసింగ్ ధోని… ఆ తర్వాత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ముఖ్యంగా 2011 సంవత్సరంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో (2011 World Cup final) చివరి బంతికి సిక్సర్ కొట్టి, టీమిండియాకు టైటిల్ అందించాడు. అయితే ఆ చివరి బంతి శ్రీలంక ఆటగాడు నువాన్ కులశేఖర (Sri Lanka pacer Nuwan Kulasekara ) వేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి సంఘటన గురించి తాజాగా నువాన్ కులశేఖర కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సిక్సర్ కొట్టిన నుంచి ధోనిపై పగ పెంచుకున్నట్లు వెల్లడించారు. అయితే, ధోని మాత్రం తన పట్ల ఫ్రెండ్లీగా ఉన్నాడన్నారు నువాన్ కులశేఖర. తన బౌలింగ్ లో సిక్షర్ కొట్టినప్పటికీ.. ఆ విషయం గురించి తన దగ్గర ఎక్కడ ప్రస్తావించకుండా, తనను గౌరవిస్తూనే ఉన్నాడని ధోని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చేశారు.
2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫైనల్స్ లో చివరి బంతికి సిక్సర్ కొట్టి, టైటిల్ అందించాడు మహేంద్ర సింగ్ ధోని. శ్రీలంక ఆటగాడు నువాన్ కులశేఖర (Sri Lanka pacer Nuwan Kulasekara ) వేసిన బంతిని.. సిక్సర్ గా మలిచి ధోని చరిత్ర సృష్టించాడు. అయితే ఈ సంఘటన గురించి తాజాగా నువాన్ కులశేఖర కీలక వ్యాఖ్యలు చేశారు. 2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత తాను చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగినట్లు గుర్తు చేశారు.
ఆ సమయంలో ప్రపంచకప్ ఫైనల్ గురించి ధోని ఒక్కసారి కూడా తనతో మాట్లాడలేదని.. చర్చ కూడా చేయలేదని పేర్కొన్నారు. అదే ధోని వ్యక్తిత్వం అంటూ కితాబు ఇచ్చారు. గతంలో జరిగిన విషయాలను ధోని ఏ మాత్రం గుర్తు చేయలేదని వెల్లడించారు. అలా గుర్తు చేసి ఎవరిని ఇబ్బంది పెట్టబోడని పేర్కొన్నారు. తనను కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఎంతో ప్రోత్సహించాడని నువాన్ కులశేఖర కీలక వ్యాఖ్యలు చేశారు. తర్వాతి మ్యాచ్ లు ఎలా గెలవాలన్న దాని పైన దృష్టి పెట్టాడు తప్ప.. కించ పరిచే గుణం ధోనీది కాదని వెల్లడించారు నువాన్ కులశేఖర. దీంతో ధోనిపై ఉన్న పగ కాస్త, ప్రేమగా మారిందన్నారు. మహేంద్ర సింగ్ ధోని ( MS Dhoni) లాంటి కెప్టెన్ టీమిండియాకు ఉండటం అదృష్టం అని ప్రశసించారు.