Tanveer Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా సాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bengaluru vs Chennai Super Kings ) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో 43 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై బెంగళూరు విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 250 పరుగులు చేయడం హాట్ టాపిక్ అయింది. దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు వాడే బ్యాట్లలో చిప్స్ పెట్టారని.. అందుకే అంత భయంకరంగా సిక్సులు అలాగే బౌండరీలు కొట్టారని బాంబ్ పేల్చారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీనిపై ఆర్సీబీ ఫ్యాన్స్ ఆగ్రహిస్తున్నారు. పాకిస్తాన్ కావాలనే కుట్రలు చేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ బెంగళూరు మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో చెత్తగా ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20వలలో 250 పరుగులు చేయడంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ అనుమానం వ్యక్తం చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన ప్లేయర్ల బ్యాట్లలో చిప్స్ పెట్టారని షాకింగ్ కామెంట్స్ చేశారు. అందుకే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు భయంకరంగా బ్యాటింగ్ చేశారని ఆరోపణలు వ్యక్తం చేశారు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్న ఒక్క ఆటగాడు కూడా పెద్దగా ఆడలేకపోయాడు.. కానీ బెంగళూరు బ్యాటర్లు మాత్రం ఇంతలా రెచ్చిపోవడం అనుమానాలకు తావు ఇస్తోందని బాంబు పేల్చారు. దీనిపై వెంటనే ఐసీసీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బ్యాటలో చిప్స్ పెట్టి ఐపిఎల్ లో భారీ స్కోరు నమోదు అయ్యేలా బీసీసీఐ కుట్రలు చేస్తోందని ఆరోపణలు చేశారు. దీనివల్ల ఐపీఎల్ వ్యూయర్ షిప్ పెరుగుతోందని, ఫలితంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ చూసేవాడు లేకుండా పోతున్నాడని తెలిపారు. దీనిపై వెంటనే ఐసీసీ చర్యలు తీసుకోవాలని, లేకపోతే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ను మూసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మొదట బౌలింగ్ చేయగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. దీంతో బెంగుళూరు 250 పరుగులు చేసింది. చేజింగ్ లో విఫలమైన చెన్నై 207 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఈ క్రమంలో 43 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది బెంగళూరు.
🚨BIG STATEMENT BY TANVEER AHMED ON RCB VS CSK MATCH🚨
"Yesterday every Pakistani was watching RCB vs CSK and no one was interested in Multan vs Quetta. The Craze of RCB vs CSK was unreal in Pakistan and PSL even after 10 days is a flop show"#RCBvsCSK pic.twitter.com/6JFIbDQyaJ
— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) April 6, 2026