E-Paper
Advertisement

ట్రాఫిక్ లో చిక్కుకున్న టీమిండియా..ఓట‌మి భ‌యంతో డ్రామాలంటూ ఇంజ‌మామ్ సంచ‌ల‌నం!

ట్రాఫిక్ లో చిక్కుకున్న టీమిండియా..ఓట‌మి భ‌యంతో డ్రామాలంటూ ఇంజ‌మామ్ సంచ‌ల‌నం!
Advertisement

Inzamam-ul-Haq:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (England vs India, 5th T20I) మధ్య శనివారం 5వ టి20 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్ ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న ఇంగ్లాండు… వైట్ వాష్ చేసే దిశగా దూసుకు వెళ్తోంది. ఈ రెండు జట్ల మధ్య రోజ్ బౌల్, సౌతాంప్టన్ స్టేడియం (The Rose Bowl, Southampton) వేదికగా ఐదవ టి20 కాసేపటి క్రితమే ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభాని కంటే ముందు ఊహించని పరిణామం ఎదురైంది. ఏడు గంటలకు టాస్ ఉండగా… సమయానికి టీమిండియా స్టేడియానికి చేరుకోలేదు. నగరంలోని ట్రాఫిక్ లో (Team India got stuck in traffic in England) ఇరుక్కున్న నేపథ్యంలో… మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ (Inzamam-ul-Haq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయంతో టీమిండియా సమయానికి స్టేడియానికి రాలేదంటూ హేళన చేశారు. వైట్ వాష్ అవుతామన్న భయంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యేలా కుట్రలు చేసినట్లు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం వేస్తున్నాయి.

Also Read: Mohammad kaif blasts selectors Over Team India Vs England : శివమ్‌ దూబే కంటే ముందు హ‌ర్షిత్ రాణాను తీసుకురావ‌డం గంభీర్ ముర్ఖ‌త్వమే 

ట్రాఫిక్ లో చిక్కుకున్న టీమిండియా..ఓట‌మి భ‌యంతో డ్రామాలంటూ!

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (England vs India, 5th T20I) మధ్య రోజ్ బౌల్, సౌతాంప్టన్ స్టేడియం (The Rose Bowl, Southampton) వేదికగా ఐదవ టి20 జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ సరిగ్గా 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ 30 నిమిషాల పాటు ఆలస్యంగా షురూ అయింది. హోటల్ రూమ్ నుంచి బయలుదేరిన టీమిండియా బస్సు, ట్రాఫిక్ లోకి చిక్కుకుందట. ఈ మేరకు టీమిండియా యాజమాన్యం సమాచారం కూడా ఇచ్చింది. ఈ క్రమంలో మ్యాచ్ 7:30 కు ప్రారంభమైంది. అంటే 30 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైనట్లు చెప్పవచ్చు. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే మూడు మ్యాచ్ లు ఓడిపోయిన టీమిండియా.. నాలుగో ఓటమి ఎదురవుతుందని భయపడిపోయినట్లు బాంబు పేల్చారు. అందుకే ట్రాఫిక్ పేరుతో మ్యాచ్ కు ఆలస్యంగా వచ్చారని ఆరోపణలు చేశారు. ఈ మ్యాచ్ కు ఆలస్యంగా వస్తే… రద్దవుతుందని పిచ్చి వేషాలు వేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నుంచి… బిసిసిఐకి స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్ళిందని… ఈ క్రమంలోనే వెంటనే టీమిండియా ప్లేయర్లు స్టేడియానికి చేరుకున్నట్లు ఆరోపణ చేశారు. అయినప్పటికీ 30 నిమిషాల ఆలస్యంతో మ్యాచ్ ప్రారంభమైనట్లు వివరించారు. చరిత్రలో ఇప్పుడు కూడా ఒక జట్టు ట్రాఫిక్ లో ఇరుక్కున్న సంఘటనలు జరగలేదని హేళన చేశారు.

Advertisement

Also Read: Inzamam-ul-Haq Reaction On Team India Kohli Vs Shreyas Iyer : కోహ్లీ కంటే శ్రేయ‌స్ అయ్య‌రే బెట‌ర్ కెప్టెన్‌..టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు

Related News

టీమిండియా ఫీల్డింగ్ కాస్త, కామెడీ షోగా మారిపోయింది

రోకో కాంబోను త‌ట్టుకోలేం…ఆసియా కప్ 2027 టీ20 ఫార్మాట్ లో నిర్వ‌హించాల్సిందే

రోనాల్డో కంటే ధోనికే ఎక్కువ ఫ్యాన్స్‌..కోహ్లీ, రోహిత్ లు కూడా జుజుబీ

టీమిండియాకు RCB ప్లేయ‌ర్ల శాపం…ఆ జ‌ట్టు ప్లేయ‌ర్లే ముంచేస్తున్నారు క‌ద‌రా

మ‌ళ్లీ ఛాన్స్ రాదు..ఇప్పుడే టీమిండియాను పాకిస్తాన్ ఓడించాలి

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు లేక‌పోతే, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేము

ఐసీసీతో కుమ్మ‌క్కు..అందుకే టీమిండియాకు మూడు ట్రోఫీలు..ఫ్లాట్ పిచ్ లు రెడీ చేసి కుట్ర‌లు!

Big Stories

Advertisement
×