E-Paper
Advertisement

రోకో కాంబోను త‌ట్టుకోలేం…ఆసియా కప్ 2027 టీ20 ఫార్మాట్ లో నిర్వ‌హించాల్సిందే

రోకో కాంబోను త‌ట్టుకోలేం…ఆసియా కప్ 2027 టీ20 ఫార్మాట్ లో నిర్వ‌హించాల్సిందే
Advertisement

Tanveer Ahmed : ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ చేతిలో వరుసగా టీమిండియా ఓడిపోతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు టి20 లకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత.. టీమిండియా జట్టు దారుణంగా ఓడిపోతూ వస్తోందన్నారు. ఆ ఇద్దరు క్రికెటర్ల వల్ల టీమిండియా కు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయన్నారు. ఓపెనర్ గా రోహిత్ శర్మ ఇరగదీయడం.. మిడిల్ ఆర్డర్ లో జట్టును ముందుకు తీసుకెళ్లడంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించి… టీమిండియా కు అనేక టైటిల్స్ తీసుకువచ్చారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని హేళన చేశారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Inzamam-ul-Haq Reaction On Team India Kohli Vs Shreyas Iyer : కోహ్లీ కంటే శ్రేయ‌స్ అయ్య‌రే బెట‌ర్ కెప్టెన్‌..టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు

ఆసియా కప్ 2027 టీ20 ఫార్మాట్ లో నిర్వ‌హించాల్సిందే

Advertisement

ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ చేతిలో వరుసగా ఓడిపోయిన టీమ్ ఇండియా జట్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మద్. ఆసియా కప్ 2027 టోర్నమెంటును వన్డే ఫార్మాట్లో కాకుండా టీ20 ఫార్మాట్ లో నిర్వహించాలని సరికొత్త మెలిక పెట్టారు. వన్డే ఫార్మాట్ లో జరిగితే, రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ టీమిండియా తరఫున బరిలోకి దిగుతారని వ్యాఖ్యానించారు. వాళ్ళిద్దరు వస్తే పాకిస్తాన్ ఓడిపోవడం గ్యారంటీ అని పరోక్షంగా హింట్ ఇచ్చారు తన్వీర్ అహ్మద్. అందుకే టీ20 ఫార్మాట్లో మాత్రమే ఆసియా కప్ 2027 టోర్నమెంట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మొన్న 2025 సమయంలో టి20 ఫార్మాట్ లో జరిగింది కదా..? అచ్చం అలాగే ఈసారి కూడా నిర్వహించాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడే టీమిండియాను ఓడించగల శక్తి పాకిస్తాన్ కి వస్తుందన్నారు. అలా కుద‌ర‌క‌పోతే, కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ ఇచ్చాకే, టీమిండియాతో పాకిస్తాన్ ఆడాలంటూ మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఆసియా కప్ 2027 షెడ్యూల్ ఇదే

ఆసియా కప్ 2027 టోర్నమెంటు షెడ్యూల్ దాదాపు ఫైనల్ అయినట్లే. బంగ్లాదేశ్ వేదికగా ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 2027 సంవత్సరం జూన్ 18వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. 2025 ఆసియా కప్ టి20 ఫార్మాట్ లో జరిగితే… ఈ టోర్నమెంట్ మాత్రం వన్డే ఫార్మాట్ లో జరగనుంది. మతం 19 మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్ స్టేజ్, సూపర్ 4, ఫైనల్స్ ఇలా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్లు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్, టీమిండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ తో పాటు మ‌రో మూడు జ‌ట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటాయి.

Advertisement

Also Read: Mohammad kaif blasts selectors Over Team India Vs England : శివమ్‌ దూబే కంటే ముందు హ‌ర్షిత్ రాణాను తీసుకురావ‌డం గంభీర్ ముర్ఖ‌త్వమే 

 

Related News

నా దృష్టిలో RCB చాలా చెత్త టీమ్…వాళ్లు ఉగాండా కంటే దారుణం

పాకిస్తాన్ ను దెబ్బ‌కొట్టేందుకు నన్ను ధోని పావులా వాడుకున్నాడు

టీమిండియాకు అవ‌మానం..టెంట్లు వేసి డ్రెస్సింగ్ రూమ్స్‌, కంపుకొట్టే టాయిలెట్స్‌

ఇమ్రాన్ ఖాన్ ఎక్క‌డ చ‌స్తే మాకేంటి ? ఇంగ్లండ్ ను ఓడించే ప‌నిలో మేం ఉన్నాం

స్టంపింగ్ చేస్తున్న‌ట్లు ముందే చెబుతాడు…ధోని సీక్రెట్ బ‌య‌ట పెట్టిన అశ్విన్‌

ఓవ‌ర్ కు ఎన్ని బంతులు ఉంటాయో తెలియ‌ని వాడికి PCB ప‌ద‌వులా ?

బీసీసీఐ ద‌గ్గ‌ర కోట్లు ఉన్న‌ప్ప‌టికీ, టీమిండియాలో స‌రైన బౌల‌ర్లే లేరు

ఇంగ్లాండ్ పై గెల‌వ‌పోతే, పాకిస్తాన్ లో కోడిగుడ్ల‌తో కొట్టడం గ్యారెంటీ!

Big Stories

Advertisement
×