E-Paper
Advertisement

Team India : గెలుపా? ఓటమా?.. చరిత్ర ఏం చెబుతోంది?

Team India : గెలుపా? ఓటమా?.. చరిత్ర ఏం చెబుతోంది?
Advertisement
Team india Latest sports News

Team India Latest sports News : విశాఖలో జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ నిర్దేశించిన లక్ష్యం.. 399 పరుగులు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టానికి 14 ఓవర్లలో 67 పరుగులు చేసింది. ఓవర్ కి యావరేజ్ న 5 పరుగుల చోప్పున చేసింది. అంటే బజ్ బాల్ వ్యూహం అమలు చేస్తున్నట్టే కనిపిస్తోంది. మరి ఇలా ఆడితే, ఇంత భారీ టార్గెట్ ను ఛేదిస్తుందా? అనే సందేహాలు నెట్టింట వ్యక్తమవుతున్నాయి.

చరిత్రలోకి చూస్తే, ఇప్పటివరకు ఏ జట్టు ఆసియాలో ఈ కొండంత లక్ష్యాన్ని ఛేదించినట్లు లేదు. 2021లో బంగ్లాదేశ్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాపై వెస్టిండీస్ సాధించిన 395 పరుగులే అత్యధికంగా ఉన్నాయి. ఆ లెక్కన చూస్తే ప్రస్తుతం టీమ్ ఇండియా 399 పరుగులు చేసింది కాబట్టి,  4 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Advertisement

భారత్‌లో చూస్తే పర్యాటక జట్టు సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన అత్యధిక పరుగులు 299 మాత్రమే. ఇంగ్లండ్ విషయానికొస్తే ఆ జట్టు అత్యధిక స్కోరు 241 పరుగులుగానే కనిపిస్తున్నాయి. నెట్టింట వీటిని చూపిస్తూ ఇండియాదే విజయం అని నెటిజన్లు కోట్ చేస్తున్నారు. కాకపోతే ఇంగ్లాండ్ స్పీడ్ చూస్తుంటే ఎటాకింగ్ మోడ్ లోనే ఆడుతున్నారు. విజయమో, వీర స్వర్గమో అన్నట్టే కనిపిస్తున్నారు.

కెప్టెన్ రోహిత్ శర్మపైనే ఇక అంతా ఆధారపడి ఉంది. బౌలర్స్ వేసే బంతులకు తగినట్టుగా ఫీల్డింగ్ మొహరించాలి. అలాగే తను షార్ట్ టెంపర్ కి గురికాకూడదు. గ్రౌండ్ లో ప్లేయర్లను బూతులు తిడుతున్నాడనే విమర్శలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనివల్ల కెప్టెన్ పై టీమ్ సభ్యులకి విశ్వాసం పోతుంది. అంతేకాదు గౌరవం కూడా ఇవ్వరు. ఇది ఓవరాల్ గా జట్టుపై ప్రభావం చూపిస్తుందని సీనియర్లు వ్యాక్యానిస్తున్నారు.

ముఖ్యంగా పేసర్ ముఖేష్ కుమార్ బాగా దొరికేస్తున్నాడు. తన బౌలింగ్ నే ఇంగ్లాండ్ బ్యాటర్లు టార్గెట్ చేసుకుని రన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. బుమ్రాని గౌరవిస్తున్నారు. ముఖేష్ ని వాయించేస్తున్నారు. 

Advertisement

తొలి ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ కూడా సాధించని అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో తొలి వికెట్ తీసి, ఇంగ్లాండ్ పతనానికి నాంది పలికాడు.రేపటి మ్యాచ్ లో కూడా ఇలాగే తన చేతుల మీదే ముగింపు పలికి, సిరీస్ ను సమం చేయాలని ఆశిస్తున్నారు. 

Related News

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

Big Stories

Advertisement
×