E-Paper

IND VS NZ 3rd Odi: విరాట్ కోహ్లీ భీక‌ర సెంచ‌రీ..తగ్గేదే లే అంటూ రెచ్చిపోయిన‌ నితీష్ కుమార్

IND VS NZ 3rd Odi: విరాట్ కోహ్లీ భీక‌ర సెంచ‌రీ..తగ్గేదే లే అంటూ రెచ్చిపోయిన‌ నితీష్ కుమార్
Advertisement

IND VS NZ 3rd Odi: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 3rd ODI )  మధ్య మూడవ వన్డే  కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మూడవ వన్డేలో అద్భుతంగా రాణించాడు విరాట్ కోహ్లీ. వికెట్లన్నీ పడిపోతున్నప్పటికీ.. విరాట్ కోహ్లీ మాత్రం ఎక్కడ తగ్గలేదు. విరాట్ కోహ్లీ ( Virat Kohli) ఒక్కడే నిలబడ్డాడు. అద్భుతమైన సెంచరీ కూడా సాధించాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli Century). కేవలం 91 బంతుల్లోనే విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. ఇందులో రెండు సిక్స‌ర్లు 8 బౌండ‌రీలు బాదాడు. 108 స్ట్రైక్ రేట్ తో దుమ్ములేపాడు విరాట్ కోహ్లీ.

Also Read: Team India: టీమిండియా కోసం రంగంలోకి జహీర్ ఖాన్..ఆ పోస్ట్ ఫైన‌ల్..ఇక మ‌నోళ్ల‌ను ఆప‌డం క‌ష్ట‌మే

54వ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇండోర్ వేదికగా మూడవ వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ తాడోపేడో అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయం కోసం టీమిండియా పోరాడుతోంది. ఇందులో భాగంగానే విరాట్ కోహ్లీ చేజింగ్ చేసే క్రమంలో సెంచరీ కూడా నమోదు చేసుకున్నాడు. కేవలం 91 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. మొన్న మొట్టమొదటి వన్డేలో 93 పరుగుల వద్ద ఒకటైన విరాట్ కోహ్లీ.. ఇవాళ మాత్రం సెంచరీ ఫినిష్ చేసుకున్నాడు. దీంతో తన వన్డే కెరీర్ లో 54 సెంచరీలు పూర్తి చేసుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు 299 వన్డే ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేశాడు విరాట్ కోహ్లీ. ఇందులో 54 సెంచరీలు అలాగే 77 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇందులో యావరేజ్ 59 గా నమోదు అయింది.

తగ్గేదేలే అంటున్న నితీష్ కుమార్ రెడ్డి

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడవ వన్డేలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా అద్భుతంగా రానించాడు. ఈ మ్యాచ్ లో 57 బంతుల్లోనే 53 పరుగులు చేసి దుమ్ము లేపాడు. విరాట్ కోహ్లీకి సపోర్ట్ గా నిలిచాడు నితీష్ కుమార్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే అర్థ సెంచరీ చేసుకున్న తర్వాత తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ తరహాలో ఫోజ్ కూడా ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. అయితే అర్థ సెంచరీ నమోదు చేసుకున్న తర్వాత కాస్త టెంప్ట్ అయ్యాడు నితీష్ కుమార్ రెడ్డి. ఇంతలోనే క్లర్క్ బౌలింగ్ లో ఒకటి అయ్యాడు. కాగా ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్, నిర్ణీత 50 ఓవర్లు ఆడి, 8 వికెట్లు నష్టపోయి 337 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా పోరాడుతోంది. 46 బంతుల్లో 84 పరుగులు చేస్తే టీమిండియా విజయం సాధిస్తుంది. ప్రస్తుతం హర్షిత రానాతో పాటు విరాట్ కోహ్లీ క్రేజ్ లో ఉన్నారు.

Advertisement

Also Read: Shubman Gill water purifier : ఇండోర్ లో మూడో వ‌న్డే..గిల్ కోసం స్పెష‌ల్ వాట‌ర్ ఫ్యూరిఫైర్‌..ఎన్ని ల‌క్ష‌లంటే

 

Related News

వార్నీ ఇదేందిర‌య్యా.. వ‌ర్షం వ‌స్తుంటే డైవ్ లు కొడుతూ లేడీ క్రికెట‌ర్ల ర‌చ్చ‌, ఏకంగా 26 ఏళ్ల త‌ర్వాత‌

Adi Reddy: హనుమంతుడిలాగా శ్రీలంక‌ను వైభ‌వ్ సూర్య‌వంశీ త‌గ‌ల‌బెడ‌తాడు

ఇక చాలు ఫ్లైట్ ఎక్కి ఇంటికి వెళ్లి, ఐపీఎల్ ఆడుకో…వైభ‌వ్ కు లంక మాజీల వార్నింగ్

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌తో డ్రెస్సింగ్ రూం పంచుకోనున్న అశ్విన్

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు WPLలో ఛాన్స్ ఇవ్వండి..అప్పుడే టీమిండియా భ‌ర‌తం ప‌డ‌తారు

బుడ్డోడు, బుడ్డోడు అంటూ వైభ‌వ్ ను రెచ్చ‌గొట్ట‌ద్దు…లంక ప్లేయ‌ర్ల‌కు సంగ‌క్క‌ర హెచ్చ‌రిక‌

మైదానంలో కాల‌ర్ ప‌ట్టుకున్నాడు…బ‌య‌ట కాళ్లు మొక్కాడు, వీడు మామూలోడు కాదురా

ఇది మీ ఐపీఎల్ కాదమ్మా..ఎక్కువ చేస్తే లంక‌లోనే పాత‌రేస్తారు, వైభ‌వ్ కు త‌న్వీర్ వార్నింగ్

×