Shubman Gill water purifier : టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రేపు మూడవ వన్డే జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య రెండు వన్డేలు పూర్తయ్యాయి. రేపు ఇండోర్ వేదికగా మూడవ వన్డే జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుకు టైటిల్ దక్కనుంది. ఇండోర్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే న్యూజిలాండ్ తో పాటు టీమిండియా జట్లు అక్కడికి చేరుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ గిల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. రాజ్ కోట్ నుంచి ఇండోర్ వెళ్లే క్రమంలో స్పెషల్ గా వాటర్ ఫ్యూరిఫైర్ ( water purifier ) కొనుగోలు చేసి తన వెంట పట్టుకుపోయాడు.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రేపు మూడవ వన్డే జరగనున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ గిల్ తన వెంట వాటర్ ప్యూరి ఫైయర్ తీసుకువెళ్లాడు. క్రికెటర్లందరూ బ్యాట్ తో కిట్ తీసుకు వెళ్తే, కెప్టెన్ గిల్ మాత్రం డిఫరెంట్ గా వాటర్ ఫ్యూరిఫైయర్ తీసుకువెళ్లాడు. దీని వెనకాల ప్రత్యేక కారణం ఉంది. మధ్యప్రదేశ్ ఇండోర్ లో నీటికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయట. అక్కడే నీళ్లు తాగితే అనారోగ్యం బారిన పడే ప్రమాదం పొంచి ఉంటుందట. అందుకే ముందు జాగ్రత్తగా తన వెంట వాటర్ ప్యూరిఫైయర్ కొనుగోలు చేసుకుని తీసుకువెళ్లాడట టీమిండియా కెప్టెన్ గిల్.
ఏకంగా మూడు లక్షలు పెట్టి మరి ఈ వాటర్ ప్యూరి ఫైయర్ ( water purifier ) కొనుగోలు చేశాడట గిల్ (shubman gill). ఆ వాటర్ ప్యూరి ఫైయర్ ను ఇండోర్ లోని తన హోటల్ రూమ్లో పెట్టుకున్నాడట. ప్రస్తుతం ఆ వాటర్ ప్యూరిఫైయర్ ద్వారానే వచ్చే నీళ్లను మాత్రమే తీసుకుంటున్నాడట. దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. గత ఏడాది కాలంగా టీమిండియా కెప్టెన్ గిల్ గాయాల బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఫిల్టర్ కానీ నీళ్లు తాగి అనారోగ్యం బారిన పడితే.. జట్టు నుంచి దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఈ స్పెషల్ ఎఫెక్ట్ వాడుకుంటున్నాడట గిల్. మిగిలిన టీమిండియా ప్లేయర్లు మాత్రం సాధారణంగా హోటల్ రూమ్ లో ఉండే వాటర్ మాత్రమే తీసుకుంటున్నట్లు టాక్.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రేపు ఇండోర్ వేదికగా మూడవ వన్డే జరగనుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య రెండు వన్డేలు పూర్తయ్యాయి. రేపు ఇండోర్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు టైటిల్ కైవసం చేసుకుంటుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ అలాగే ఇండియా మధ్య 5 t20 లు జరగనున్నాయి.
Shubman Gill arrived in Indore with a water purifier worth 3 lakh rupees. Indore, India's cleanest city, was recently in the national spotlight due to a contaminated water crisis. Now, there is a cricket match between India and New Zealand here, and the Indian team has arrived pic.twitter.com/WDXAkRMaYE
— Niraj kumar (@Nirajkumar22787) January 17, 2026