Intinti Ramayanam Today Episode june 17th: నేను బ్లడ్ మార్చాను కదా మరి ఆ మీనాక్షి ఎలా బతికింది అని పల్లవి ఆలోచిస్తూ బయటికి వస్తుంది.. నేను బ్లడ్ మార్చిన తర్వాత కూడా మీనాక్షి బతకడం ఇంపాజిబుల్ కానీ ఎలా బతికింది అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటారు. వెనకాల పల్లవి అని గట్టిగా ఒక మాట వినిపించడంతో వెనక్కి తెలియజేస్తుంది.. అవని మా అమ్మ ఎలా బతికింది అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా నువ్వు మా అమ్మని బతికించడానికి రాలేదు చంపేయడానికి వచ్చావని నాకు అర్థమైంది. అందుకే నిన్ను ఎక్కడ మిస్ చేయకుండా ఒక కంట కనిపెట్టాను.. నువ్వు బ్లడ్ మార్చిన సంగతి నాకు అర్థం అయిపోయింది. అందుకే నిన్ను ఫాలో అవుతూ లోపలికి కూడా వచ్చాను నువ్వు చేసిన పని నాకు అర్థం అయిపోయింది.. నీ బుద్ధి ఇంకా ఎప్పటికీ మారదా నా కన్నతల్లిని బయటకు తీసుకుని వచ్చి చూపిస్తారు అని పల్లవి తో అవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది..
రాజేశ్వరి 11 రోజుల కార్యక్రమం అయిపోయింది కదా పల్లవి ఇక్కడ ఉండకూడదు అని పార్వతి అంటుంది.. కానీ పల్లవి మాత్రం పార్వతి ఎంత చెప్తున్నా సరే నేను ఆ ఇంటికి రాను నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది.. నేనెవరిని చెప్పినా ఇక్కడికి రాను అని పల్లవి మొండిగా అంటుంది.. నేను ఎక్కడికి రావాల్సిన అవసరం నాకు లేదు నేను ఇక్కడే ఉంటాను అని పల్లవి ఎంత చెప్తున్నా సరే వినకుండా అలానే ఉంటుంది.. రోజులు అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండకూడదమ్మా అని పార్వతి ఎంతగా అడుగుతున్నా సరే పల్లవి మాత్రం నేను రాను అని వెళ్ళిపోతుంది.. కానీ భానుమతి మాత్రం పల్లవి దగ్గరికి వెళ్లి అవని పై రివెంజ్ తీర్చుకోవాలని అనుకున్న కదా మరి నువ్వు ఇక్కడ ఉంటే అవని అక్కడ ఉంటే ఎలా జరుగుతుంది అని అంటుంది. నువ్వు ఏం చేయాలనుకున్న సరే అక్కడ ఉండే చేయాలి అదే నీ ఇల్లు నీకు ఇప్పుడు తల్లి లేదు కాబట్టి పార్వతీ నీకు అత్తయ్య అమ్మాయి నా తనే అని ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పి పల్లవిని ఒప్పిస్తుంది భానుమతి. ఇక పల్లవి అత్తగారింటికి వెళ్లడానికి ఒప్పుకుంటుంది.
హాస్పిటల్ లో ఉన్న మీనాక్షిని చూసి అవని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. మా అమ్మకి ఇలా జరగడానికి కారణం పల్లవిని అని అవని బాధ పడిపోతూ ఉంటుంది. అవని దగ్గరకొచ్చిన అక్షయ్ మీ అమ్మ అంటే అంత కోపం ఉన్న పల్లవి రక్తం ఇచ్చి ఎలా కాపాడాలనుకునింది అని అంటాడు.. అయితే అవని పల్లవి కాపాడింది అని మీరు అనుకుంటున్నారు కానీ పల్లవి రక్తం మర్చిపోమని చంపాలి అనుకున్న విషయం మీకు తెలిస్తే మీరే వెళ్లి పల్లవిని చంపేస్తారు అని మనసులో అనుకుంటుంది. ఏది ఏమైనా కూడా పల్లవి ఈమధ్య మారుతుంది అని అక్షయ్ అంటాడు.. కానీ అవని మాత్రం పల్లవిలో ఇంకా మార్పు రాలేదు. ఎలాగైనా సరే తన తల్లి మీనాక్షి అని చెప్పేస్తాను అని అనుకుంటుంది..
కమల్ సుబ్బారావు ఎక్కడికి వెళ్ళాడు అర్థం కావడం లేదు వదినా.. నేను అంతా వెతుకుతున్నాను కానీ అతని ఎక్కడికి వెళ్లాడో నాకు అస్సలు అంతుచిక్కడం లేదు అని అంటాడు.. అయితే నువ్వేమీ కంగారు పడకు అన్నయ్య ఎక్కడున్నాడో నేను వెతికి పట్టుకుంటాను అని అవని అంటుంది.. ఆ సుబ్బారావు ఎక్కడున్నాడు అర్థం కావడం లేదు అంటండి కమల్ వెతుకుతున్నాడట కానీ దొరకలేదు అని ఫోన్ చేశాడు అని అవని అంటుంది. సుబ్బారావుని ఎక్కడున్నా సరే మనం వెతికి పట్టుకోవాలి అవని దీనంతటికీ కారణం ఏంటి అనేది మనం కోర్టులో చెప్తే అత్తయ్య గారిని వెంటనే రిలీజ్ చేస్తారు అని అంటాడు.. ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నానండి ఎలాగైనా సరే అమ్మని బయటకు తీసుకురావాలి అని అవని అంటుంది..
మీనాక్షి స్పృహలోకి వచ్చిందని తెలుసుకుందామని తన తల్లిని చూడడానికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నేను హాస్పిటల్ కి ఎలా వచ్చాను అని మీనాక్షి అంటుంది. నాకు బ్లడ్ వామిట్ అయిపోయింది అందుకే నన్ను ఇక్కడ జాయిన్ చేశారా? అసలు ఏం జరిగింది నాకు అని మీనాక్షి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏమైపోతుందని నేను బాధపడడం లేదు మీరు బాధపడతారు అని నేను బాధపడుతున్నాను అని మీనాక్షి కన్నీళ్లు పెట్టుకుంటుంది. చచ్చిపోయి ఉంటే బాగుండేది ఆ రాజేశ్వరి బదులు నేను చనిపోయి ఉంటే మీకు ఈ బాధలు తప్పేమీ అని తను బాధ పడిపోతూ ఉంటుంది. ఏంటమ్మా మాటలు నువ్వు అలా మాట్లాడొద్దు అమ్మా అని అవని కన్నీళ్లు పెట్టుకుంటుంది. త్వరలోనే బయటికి తీసుకుని వస్తాము నువ్వు ఏమీ బాధపడకు ప్రశాంతంగా ఉండు అని అవని అంటుంది..
పల్లవి ఇంట్లోకి రాగానే పార్వతి తనకి జ్యూస్ చేసి ఇస్తుంది. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీ ఆ పల్లవిని చూసి ఇది ఇంట్లోకి వచ్చిందంటే రచ్చ రచ్చగా ఉంటుంది.. అసలు ఈ పల్లవి వచ్చింది అంటేనే నాకు ఏదోలా ఉంది. అయితే నాకు జ్యూస్ తాగే టైం అయిపోయింది అని అనగానే పల్లవి నేను ఇంట్లోకి రావడం మీకు ఇష్టం లేదా ఏంటి ఇంట్లోకి వచ్చి రాగానే నా చేత పని చేయించాలని అనుకుంటున్నావా అని శ్రియతో అంటుంది.. నేను అత్తయ్య గారికి చెప్పాను నీకు చెప్పలేదు అవని అక్క లేదు కదా అని అత్తయ్యతోనే నేను జ్యూస్ కావాలని అంటున్నాను అని అంటుంది.. అయితే అక్కడికి వచ్చి నాకు కమల్ నువ్వు ఇలా ఉండడం అస్సలు బాగోలేదు. మీ అమ్మ చనిపోయింది అన్న బాధలో ఉన్నావని నిన్ను ఏమీ అనట్లేదు నువ్వు అది అలుసుగా తీసుకొని రెచ్చిపోతున్నావు అని అంటారు.. కమల్ వార్నింగ్ ఇవ్వడంతో పల్లవి మౌనంగా ఉండిపోతుంది..
సుబ్బారావు అలాగే నిర్మల తమల్ని ఎవరో కిడ్నాప్ చేశారని బాధపడిపోతూ ఉంటారు.. అయితే పల్లవి అక్కడున్న రౌడీ లకి ఫోన్ చేసి ఏం జరిగిందో అని తెలుసుకుంటారు. సుబ్బారావు నిర్మల అక్కడే ఉన్నారు కదా వాళ్ళని ఎట్టి పరిస్థితులను బయటికి తీసుకురావద్దు అని పల్లవి వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది. అయితే పల్లవి నిజంగానే వాళ్ళని కిడ్నాప్ చేసి ఉండడంతో ఆ విషయం తెలియక సుబ్బారావు నిర్మల ఎవరో కిడ్నాప్ చేశారని భయపడిపోతూ ఉంటారు.. అవనీ వాళ్ళ తల్లిని జీవితాంతం జైల్లోనే ఉంచాలి అంటే సుబ్బారావు వాళ్ళు బయటపడకుండా ఉండాలి అని రౌడీలకు చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…