E-Paper
Advertisement

Yashasvi Jaiswal : ఒకే ఒక్కడు.. ఏడు పార్టనర్ షిప్‌లు..

Yashasvi Jaiswal : ఒకే ఒక్కడు.. ఏడు పార్టనర్ షిప్‌లు..
Advertisement
Yashasvi Jaiswal Batting

Yashasvi Jaiswal : విశాఖలో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమ్ ఇండియా పరిస్థితి ఆశాజనకంగానే కనిపిస్తోంది. 6 వికెట్ల నష్టానికి 336 పరుగులతో తొలిరోజు ముగించింది. కాకపోతే ఒకే ఒక్కడు 7 వికెట్ల భాగస్వామ్యాన్ని నెలకొల్పి నాటౌట్ గా నిలిచాడు. సహచరులందరూ ఒకొక్కరు వెనుతిరుగుతున్నా, చలించకుండా, వెన్ను చూపకుండా ఒంటరి పోరాటం చేస్తున్న.. యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్. ప్రస్తుతం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 179 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

257 బాల్స్ ఆడి 17 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఒక అద్భుత ఇన్నింగ్స్ నడిపించాడు. తొలిటెస్ట్ లో ఇంగ్లాండ్ క్రికెటర్ ఒలిపోప్ ఆడిన తీరుని, టీమ్ ఇండియా నుంచి తను చేసి చూపించాడు. ఓపెనర్ గా వచ్చిన యశస్వి తన భాగస్వామ్యాలను చక్కగా నిర్మించిన తీరు ఒకసారి చూద్దాం…

Advertisement

కెప్టెన్ రోహిత్ శర్మ (14)తో కలిసి తొలివికెట్ కి 40 పరుగులు జతచేశాడు. తర్వాత రెండో వికెట్ కి శుభ్ మన్ గిల్ (34)తో కలిసి 49 పరుగులు చేశాడు. మూడో వికెట్ కి శ్రేయాస్ అయ్యర్ (27) తో కలిసి 90 పరుగులు చేశాడు. ఇదే తొలిరోజు హయ్యస్ట్ పార్టనర్ షిప్ అని చెప్పాలి.

తర్వాత నాలుగో వికెట్ కి రజత్ పటీదార్ (32)తో 70 పరుగులు చేశాడు. తర్వాత ఐదో వికెట్ కి అక్షర్ పటేల్ (27)తో కలిసి 52 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేశాడు. తర్వాత ఆరో వికెట్ కి వికెట్ కీపర్, ఆంధ్రా ప్లేయర్ కేఎస్ భరత్ (17) తో కలిసి 29 పరుగులు చేశాడు. చివరిగా అశ్విన్ (5 నాటౌట్) తో కలిసి 6 పరుగులు చేశాడు.

Advertisement

ఇలా ఓవరాల్ గా టీమ్ ఇండియా 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. ఈ చైన్ లింక్ పొడవునా యశస్వి జైస్వాల్ తొలిరోజు ఆటలో జట్టు స్కోరుకి వెన్నుముకగా నిలిచాడు. రెండో రోజు మరి భారత అభిమానులు ఆశిస్తున్నట్టు డబుల్ సెంచరీ చేస్తాడా? జట్టు స్కోరుని 400 దాటిస్తాడా? అనేది వేచి చూడాల్సిందే.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×