E-Paper
Advertisement

YS Sharmila : షర్మిలతో వివేకా కుమార్తె భేటీ.. సునీత పొలిటికల్ ఎంట్రీపై చర్చ..

YS Sharmila : షర్మిలతో వివేకా కుమార్తె భేటీ.. సునీత పొలిటికల్ ఎంట్రీపై చర్చ..
Advertisement
YS Sharmila

YS Sharmila : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్‌ సునీత ఇడుపులపాయలో భేటీ అయ్యారు. కడప పర్యటనలో ఉన్న షర్మిలను ఆమె ఇడుపులపాయ ఎస్టేట్‌లో కలిశారు. గత కొన్ని రోజులుగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ సునీత ఆమెను మొదటిసారిగా కలిసింది.

వైఎస్ సునీత రాజకీయ ప్రవేశంపై ఈ భేటీలో చర్చ జరగినట్లు తెలుస్తోంది. అలాగే తన తండ్రి హత్య కేసుపై చర్చించినట్లు సమాచారం. వివేకా హత్య కేసులో సునీతకు న్యాయం జరగాలని పలుమార్లు షర్మిల డిమాండ్ చేశారు. రాజకీయంగా వారిని ఎదుర్కునేందుకు సునీత కాంగ్రెస్‌లో చేరి ఎన్నికల బరిలో దిగతారని ప్రచారం జరుగుతోంది.

Advertisement

ఇక వివేకా హత్యపై సునీత మొదటి నుంచి గట్టి పోరాటమే చేస్తున్నారు. కోర్టును ఆశ్రయించి సీబీఐ విచారణ కోరడం.. ఆ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం తెలిసిందే. వివేకా హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు అరెస్టు అయ్యారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. భాస్కర్ రెడ్డితో పాటు ఇతరులు చంచల్‌గూడ జైలులో రిమాండు ఖైదీలుగా ఉన్నారు. అవినాష్‌రెడ్డి బెయిల్‌‌పై ఉన్నారు. దీనిపై సునీత సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. ఆ తర్వాత షర్మిలతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా భేటీ అయ్యారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×