E-Paper
Advertisement

Ayyanna Patrudu : షర్మిలకు ప్రాణహాని.. భద్రత పెంచాలి..

Ayyanna patrudu : భూములను కబ్జా చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని సీఎం జగన్ ను ఆయన ప్రశ్నించారు. విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

Ayyanna Patrudu : షర్మిలకు ప్రాణహాని.. భద్రత పెంచాలి..

Ayyanna patrudu : భూములను కబ్జా చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని సీఎం జగన్ ను ఆయన ప్రశ్నించారు. విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

వైసీపీ నేతలు భూములు కనిపిస్తే బెదిరించి లాక్కుంటున్నారని అయన్న పాత్రుడు ఆరోపించారు. వైసీపీ నేతల అక్రమాలు, దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయిందన్నారు. గత నాలుగున్నరేళ్లలో ఉత్తరాంధ్రకు ఏం చేశారని సభ పెట్టారు? ప్రశ్నించారు. విశాఖ బీచ్‌ రోడ్డు నుంచి భీమిలి వెళ్లే వరకు ప్రభుత్వ భూములను ఏమైనా మిగిల్చారా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు ఎందుకు మీకు ఓట్లేయాలి? ప్రశ్నించారు. భూములు దోచుకున్న వైసీపీ నేతలను వదిలిపెట్టే ప్రశస్తే లేదని హెచ్చరించారు. మూడు నెలల తర్వాత అందరి లెక్కలు తీస్తామన్నారు. ఎన్నికల తర్వాత జగన్‌ లండన్‌, అమెరికాలో దాక్కున్నా లాక్కొచ్చి.. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తామని హెచ్చరించారు.

జగన్‌కు తల్లి, చెల్లి, బాబాయ్‌ అనే తేడా లేదని అయన్న పాత్రుడు అన్నారు. జగన్ షర్మిలను అంతమొందించినా ఆశ్చర్య పడక్కర్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు భద్రత పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజశేఖర్‌రెడ్డి ఆస్తిలో షర్మిలకు వాటా రాశారు. అది జగన్‌ ఇవ్వడం లేదని ఆరోపించారు.

తనకు ప్రాణహాని ఉందని, రివాల్వర్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేశానని అయ్యన్న పాత్రుడు తెలిపారు. గన్‌మెన్‌ను ఇస్తానని ఎస్పీ అంటే తనే వద్దనేశానన్నారు. ఎక్కడ ఉన్నానో గన్‌మెన్‌లే సమాచారం ఇస్తారని వద్దని చెప్పానని తెలిపారు. అనకాపల్లి ఎంపీ స్థానానికి తన కుమారుడు దరఖాస్తు చేశారన్నారు. ఆ అంశం అధిష్ఠానం పరిశీలిస్తోందని తెలిపారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×