E-Paper
Advertisement

Prodduturu TDP : వైసీపీ కంచుకోటపై టీడీపీ ఫోకస్.. ప్రొద్దుటూరు టికెట్ కోసం తమ్ముళ్ల ఫైట్..

Prodduturu TDP : కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజకీయం రోజురోజుకి రంజుగా మారుతోంది. జిల్లా లో ఎక్కడా లేని విధంగా ఆ నియోజకవర్గం రోజుకో వివాదంతో వార్తల్లో ఉంటోంది. అక్కడ వైసీపీ, టీడీపీలు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నాయి. వైసీపీ ఖాతాలో ఉన్న ఆ సెగ్మెంట్లో ఎలాగైనా పాగా వేయాలని టీడీపీ పట్టుదలతో ఉంది .. అయితే టీడీపీ ప్రొద్దుటూరు ఇన్‌చార్జ్‌గా ఉన్న ప్రవీణ్‌కి రాజకీయ అనుభవం లేకపోవడం.. పార్టీలో కొనసాగుతున్న టికెట్ వార్ తమ్ముళ్లను గందరగోళ పరుస్తోందంట.

Prodduturu TDP : వైసీపీ కంచుకోటపై టీడీపీ ఫోకస్.. ప్రొద్దుటూరు టికెట్ కోసం తమ్ముళ్ల ఫైట్..
Advertisement

Prodduturu TDP : కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజకీయం రోజురోజుకి రంజుగా మారుతోంది. జిల్లా లో ఎక్కడా లేని విధంగా ఆ నియోజకవర్గం రోజుకో వివాదంతో వార్తల్లో ఉంటోంది. అక్కడ వైసీపీ, టీడీపీలు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నాయి. వైసీపీ ఖాతాలో ఉన్న ఆ సెగ్మెంట్లో ఎలాగైనా పాగా వేయాలని టీడీపీ పట్టుదలతో ఉంది .. అయితే టీడీపీ ప్రొద్దుటూరు ఇన్‌చార్జ్‌గా ఉన్న ప్రవీణ్‌కి రాజకీయ అనుభవం లేకపోవడం.. పార్టీలో కొనసాగుతున్న టికెట్ వార్ తమ్ముళ్లను గందరగోళ పరుస్తోందంట.

ప్రొద్దుటూరు.. కడప జిల్లాలోని కీలక నియోజకవర్గం.. వైఎస్ హయాంలో కాంగ్రెస్‌కి.. తర్వాత వైసీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం గతంలో రెండు సార్లు గెలిచినా.. ఆ పట్టు నిలబెట్టుకోలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో అయినా ప్రొద్దుటూరులో టీడీపీ సత్తా చాటుతానంటూ దూకుడు ప్రదర్శిస్తున్నారు పార్టీ ఇన్చార్జ్ ప్రవీణ్‌కుమార్ రెడ్డి.

Advertisement

ప్రొద్దుటూరు నుంచి 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఎమ్యెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హ్యాట్రిక్ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాచమల్లును వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరతామంటూ.. టీడీపీ ఇన్చార్జ్ ప్రవీణ్‌తో పాటు ఇతర నేతలు ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. ఆక్రమంలో వారు రాచమల్లు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో చేస్తున్న నిరసనలు.. ప్రొద్దుటూరులో చర్చనీయాంశంగా మారుతున్నాయి.

ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మధ్య పొలిటికల్ వార్ రోజు రోజుకి ఉద్రిక్తంగా మారుతోంది. గతంలో ఎవరు చేయని అభివృద్ధి తాను చేశానని.. ప్రొద్దుటూరు అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని రాచమల్లు చెబుతుంటే.. అవినీతి అక్రమాలు చేసి రాచమల్లు వేల కోట్లకు పడగలెత్తారని టీడీపీ ఆరోపిస్తోంది.

Advertisement

ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ని 50 రోజులు జైల్లో పెట్టించడం.. ప్రొద్దుటూరులో రాజకీయంగా దుమారం రేపింది. టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ స్వయంగా వెళ్లి కడప సబ్ జైల్లో ప్రవీణ్‌ని పరామర్శించి.. ప్రొద్దుటూరు టికెట్ కన్ఫార్మ్ చేయడంతో రాజకీయం మరింత రంజుగా మారింది. అయితే ఏమాత్రం రాజకీయ అనుభవం లేని ప్రవీణ్ రాచమల్లును రాజకీయంగా ఎదుర్కోలేక.. వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం రేపుతున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.

జిల్లాలో ఎక్కడా లేని విధంగా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంటున్న రాజకీయ వివాదాలు ఏ పార్టీకి మేలు చేస్తాయో అర్థం కాకుండా తయరైందంటున్నారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్టు ఎపిసోడ్ ప్లస్ అవుతుందని టీడీపీ భావిస్తుంటే.. వైసీపీ నేతలు మాత్రం ప్రవీణ్ వ్యవహారాన్ని లైట్ తీసుకుంటున్నారంట. ఆ క్రమంలో తనకు టీడీపీ టికెట్ ఇస్తే.. రాచమల్లు ను ఓడిస్తానంటున్నారు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి.. మరోవైపు పార్టీ కోసం రెండు సార్లు జైలుకెళ్లి వచ్చిన తనకే టికెట్ ఖరారైందంటూ ప్రచారం మొదలెట్టేశారు ప్రవీణ్‌కుమార్.

జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నమాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి.. వారిద్దరని పక్కకి నెట్టేస్తూ తానే ప్రొద్దుటూరు నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించేసుకుంటున్నారు. వీరు చాలదన్నట్టు ప్రొద్దుటూరులో అన్న క్యాంటీన్ పెట్టి.. గత 6 నెలలుగా ఉచితంగా మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు సీఎం సురేష్ నాయుడు.. ప్రస్తుతం బీజేపీలో ఉన్న రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ సోదరుడే ఈ సురేష్‌నాయుడు.. అధిష్టానం ఆదేశాల మేరకు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశానని సురేష్ నాయుడు చెప్పుకోవడం.. ఇప్పటికే ఉన్నవారితో తలలు పట్టుకుంటున్న టీడీపీ కార్యకర్తలను మరింత అయోమయానికి గురిచేస్తోంది. మరి ఈ నాలుగుస్థంభాలాట ఎటు దారి తీస్తుందో చూడాలి.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×