E-Paper
Advertisement

TTD : టీటీడీ కీలక నిర్ణయం.. వార్షిక బడ్జెట్‌కు ఆమోదం..

TTD : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 వార్షిక బడ్జెట్‌ను టీటీడీ ఆమోదం తెలిపింది. రూ. 5141.75 కోట్లతో వార్షిక బడ్జెట్‌ రూపొందించింది. నూతన వివాహం చేసుకోనే వధూవరులకు మంగళసూత్రాల విక్రయానికి బోర్డు ఆమోదం తెలియజేసింది. టీటీడీ పాలక మండలి సమావేశం అనంతరం వివరాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి వెల్లడించారు.

TTD : టీటీడీ కీలక నిర్ణయం.. వార్షిక బడ్జెట్‌కు ఆమోదం..
Advertisement
AP updates

TTD latest news today(AP updates):

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 వార్షిక బడ్జెట్‌ను టీటీడీ ఆమోదం తెలిపింది. రూ. 5141.75 కోట్లతో వార్షిక బడ్జెట్‌ రూపొందించింది. నూతన వివాహం చేసుకోనే వధూవరులకు మంగళసూత్రాల విక్రయానికి బోర్డు ఆమోదం తెలియజేసింది. టీటీడీ పాలక మండలి సమావేశం అనంతరం వివరాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి వెల్లడించారు.

మంగళ సూత్రాలు తయారు చేసి శ్రీవారి పాదాల చెంత ఉంచి విక్రయించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అదే తరహాలో లక్ష్మీ కాసులను కూడా విక్రయించనున్నట్లు పేర్కొంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కాస్ట్ టూ కాస్ట్ విక్రయించే విధంగా చర్యలు తీసుకునేందుకు చర్యలు తీసుకుంది. టీటీడీ దేవస్థానం పోటులో పనిచేసే 70 మంది స్కిల్డ్ కార్మికులను గుర్తించి.. వారి జీతాన్ని 15 వేలకు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఇదే తరహాలో 6 వేద పాఠశాలలో 51 మంది అధ్యాపకుల జీతాలను రూ. 35 వేల నుంచి రూ. 54 వేలకు పెంచుతున్నట్లు నిర్ణయించింది.

Advertisement

టీటీడీ ఆధ్వర్యంలోని 26 ఆలయాలు ఉన్నాయి. దేవస్థానం పరిధిలో 34 ఆలయాలలో భక్తులు సౌకర్యార్దం ఉద్యోగుల నియామకానికి ప్రభుత్వ అనుమతికి లేఖ రాశారు. గోగర్బం నుంచి ఆకాశగంగ వరకు నాలుగు వరుసల రోడ్ల నిర్మాణానికి 30 కోట్లు కేటాయించారు. నారాయణవనంలో కొలువైన భధ్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయం అభివృద్ది పనులకు 6.9 కోట్లు కేటాయించారు. స్విమ్స్ అభివృద్ది పనులుకు 148 కోట్లు కేటాయిస్తూ టీటీడీ ఆమోద ముద్ర వేసింది. రూ. 2.5 కోట్లతో సప్తగిరి అతిధి గృహలు అభివృద్ది పనులుకు. ఎస్ఏంసీ, ఎస్ఎన్ సీకాటేజీల అభివృద్ది పనులుకు 10 కోట్లు కేటాయించింది.

టీటీడీ దేవస్థానం హుండి ద్వారా 1611 కోట్లు వస్తోందని టీటీడీ పాలక మండలి అంచనా వేసింది. దర్శన టిక్కేట్లు విక్రయం ద్వారా 338 కోట్లు, వడ్డి ద్వారా 1,167 కోట్లు, ప్రసాదం విక్రయం ద్వారా 600 కోట్లను అంచనా వేసింది. జీతాలు చెల్లింపుకు 1.733 కోట్లు,కార్పస్ ఫండ్‌కుకి 750 కోట్లు, ముడిసరుకులు కోనుగోలుకు 751 కోట్లు, ఇంజనీరింగ్ పనులుకు 350 కోట్లు కేటాయించినట్లు టీటీడీ తెలిపింది.

Advertisement

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×