Safe Delivery: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ జిహెచ్ఎంసి పరిధిలోని మునీరాబాద్ గ్రామానికి చెందిన ఆర్తి కుమారి (22) పురిటి నొప్పులతో బాధపడుతుండగా 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. గుండ్లపోచంపల్లి కేంద్రానికి చెందిన 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ సీతారామ్, పైలట్ అశోక్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే నొప్పులు అధికమవడంతో ఆసుపత్రికి తరలించే అవకాశం లేకపోవడంతో, ఈఎంటీ సీతారామ్ వైద్యుల సూచనల మేరకు ఇంటి వద్దే సురక్షితంగా ప్రసవం నిర్వహించారు.
Also Read: BRS : కాళ్లబేరానికొచ్చిన ‘పాడి కౌశిక్ రెడ్డి’.. అసలేమైంది?
మంగళవారం ఉదయం సుమారు 9.30 గంటలకు ఆర్తి కుమారి పండంటి ఆడబిడ్డకు ఆ తల్లి జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. అనంతరం మెరుగైన వైద్య సంరక్షణ కోసం వారిని మేడ్చల్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో స్పందించి తల్లి, శిశువును కాపాడిన 108 అంబులెన్స్ సిబ్బంది సీతారామ్, అశోక్లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటతో ఆయన కొందరికి స్పూర్తిగా నిలిచారు.
Also Read: Harishrao: అసెంబ్లీ సమావేశాలు ముగింపు.. హాట్ కామెంట్స్ చేసిన హరీష్రావు, కేవలం అందుకోసమే