Big Stories

KCR : కేసీఆర్ కు 15 ప్రశ్నలు.. కమాన్ ఆన్సర్!

KCR : మునుగోడు ఎలక్షన్ లో బీజేపీ బండి దూసుకుపోతోంది. కేసీఆర్ పై పదునైన విమర్శలతో టీఆర్ఎస్ ను అడుగడుగునా కార్నర్ చేస్తోంది. ఎనిమిది ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం.. ప్రజలకు ఏం చేసిందంటూ నిలదీస్తోంది. తెలంగాణ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేస్తోంది. కేసీఆర్ కుటుంబ అవినీతిపై అనేక ఆరోపణలు చేస్తూ గులాబీ బాస్ కు గుబులు పుట్టిస్తున్నారు కమలనాథులు.

- Advertisement -

పోలింగ్ డేట్ సమీపిస్తున్న కొద్దీ మరింత జోరు పెంచారు బీజేపీ నేతలు. తాజాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.. సీఎం కేసీఆర్ కు 15 ప్రశ్నలతో లేఖాస్త్రం సంధించారు. మునుగోడుకు ఏం చేశారు? తెలంగాణలో ఏం సాధించారంటూ.. ప్రజల పక్షాన పలు అంశాలపై ప్రశ్నలతో కేసీఆర్ ను నిలదీశారు బండి సంజయ్. ఆయన సంధించిన ప్రశ్నలు ఏంటంటే….

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News