NagarKurnool Distrct: నాగర్ కర్నూల్ జిల్లాలో.. ఒక్క ఆటోలో 23 మంది చిన్నారులు తీసుకెళ్తున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఏమాత్రం భయం లేకుండా.. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. అలా చిన్నారులను తీసుకెళ్తుండగా పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు.. ఆటోను సీజ్ చేశారు. చిన్నారులను మరో రెండు వాహనాల్లో ఇంటికి పంపించారు. పిల్లల ప్రాణాలో చెలగాటం ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దారుణం.. ఆటో నడుపుతున్న వారు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అది ఉండేది చిన్నగా.. దాంట్లో మాత్రం బస్సుకు పట్టే జనాలకు ఎక్కించుకుంటారు. ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. నాగర్కర్నూల్ జిల్లాలో ఒక్క ఆటోలు 23 మంది పాఠశాల చిన్నారులను ఎక్కించుకున్నాడు. ఆ చిన్నారులను తీసుకెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్గా’ పట్టుకోని ఆటోను ఆపారు..
ఇంత మంది చిన్నారులను ఎక్కించుకోని నడపడం నేరం అని టోల పరిమితి 10 మంది వరకు మాత్రమే అని హెచ్చరించారు. అంతేకాకుండా ఆ ట్రాఫిక్ఎస్ఐ కల్యాణ్ నేతృత్వంలో జరిగిన ఈ చెకింగ్లో పోలీసులు ఆటో డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకున్నారు. చిన్నారుల ప్రాణాలతో ‘చెలగాటం’ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు.
Also Read: బీజేపీ అగ్రనేతల మధ్య కోల్డ్ వార్.. పతాక స్థాయికి చేరిన పోరు
అలాగే పోలీసులు వెంటనే ఆటోను సీజ్ చేసి, చిన్నారులను మరో రెండు వాహనాల్లో సురక్షితంగా వారి ఇంటికి చేర్చారు. ఈ చర్యలతో చిన్నారులకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు. డ్రైవర్పై లైసెన్స్ సస్పెన్షన్, జరిమానా వంటి చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా తల్లిదండ్రులకు కూడా పోలీసులు హెచ్చరించారు. చిన్నారులను సురక్షితంగా స్కూల్కు పంపడానికి అధికారులు, ఆటోలు లేదా బస్సులు మాత్రమే ఉపయోగించమని, ఓవర్లోడింగ్కు పాల్పడకూడదని కోరారు.