E-Paper
Advertisement

Bandi Vs Eatala: బీజేపీ అగ్రనేతల మధ్య కోల్డ్ వార్.. పతాక స్థాయికి చేరిన పోరు

Bandi Vs Eatala: బీజేపీ అగ్రనేతల మధ్య కోల్డ్ వార్.. పతాక స్థాయికి చేరిన పోరు

Bandi Vs Eatala: కరీంనగర్ కాషాయ దళంలో కోల్డ్ వార్ నడుస్తోంది. జిల్లాలో బండి వర్సెస్ ఈటెల అన్న చందంగా తయారైంది. తాజాగా వీరిద్దరి మధ్య పోరు పతాక స్తాయికి చేరింది. ఈటల సొంతగడ్డ హుజురాబాద్ వేదికగా నేడు జరగబోయే పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం..బండి, ఈటల మధ్య అంతర్గత విభేదాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ సమావేశం కోసం హుజురాబాద్ పట్టణంలో బండి వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఈటల ఫోటో లేకపోవడంతో బీజేపీ రాష్ట్ర అగ్రనేతల మధ్య కోల్డ్ వార్ బహిర్గతమైంది.

ఫ్లెక్సీల్లో ఈటల రాజేందర్ ఫోటో అదృశ్యం..
హుజురాబాద్ మధువని గార్డెన్‌లో ఇవాళ కరీంనగర్‌ పార్లమెంట్ నియోజకవర్గ బూతు అధ్యక్షుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాజరుకానున్నారు. ఈ క్రమంలో బండి అనుచరులు..హుజురాబాద్ పట్టణాన్ని ఫ్లెక్సీలతో నింపేశారు. ఎక్కడ చూసిన బండి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. అయితే ఈ ఫ్లెక్సీల్లో కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతల ఫోటోలు ఉన్నా.. ఈటల రాజేందర్ ఫోటో మాత్రం ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశానికి ఈటల డుమ్మా ?
హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే అయిన ఈటల రాజేందర్… బండి సంజయ్‌ ఆధ్వర్యంలో జరిగే కరీంనగర్ పార్లమెంట్‌ బూత్‌స్థాయి సమావేశానికి రావడం అనుమానంగా మారింది. బండి సంజయ్, ఈటల మధ్య కోల్డ్ వార్‌ నడుస్తున్న క్రమంలో ఈటల రాకపోవచ్చని తెలుస్తోంది. అయితే హుజురాబాద్‌లో కరీంనగర్ పార్లమెంట్‌ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తుండగా..ఇందుకు పోటీగా రేపు హుజురాబాద్‌లో ఈటల పర్యటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన అనుచరులు ఈటల పర్యటన షెడ్యూల్‌ను ప్రకటించారు.

Also Read: నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం.. నవోదయ విద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య..

ఈటల, బండి కోల్డ్‌వార్‌తో రెండుగా చీలిన బీజేపీ కార్యకర్తలు
ఆధిపత్య పోరులో భాగంగానే బండి సంజయ్, ఈటల రాజేందర్.. ఒకరి తర్వాత ఒకరు పోటాపోటీ పర్యటనలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో పట్టు కోసం ఇప్పటికే బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు. ఇప్పటికే హుజురాబాద్‌ నియోజకవర్గంలో స్థానిక సంస్థలకు సంబంధించిన బీజేపీ బీఫారాలు తానే ఇస్తానని ఈటల ప్రకటించారు. ఈ క్రమంలో హుజురాబాద్‌పై పట్టు సాధించేందుకు బండి సమావేశాలతో దూసుకుపోతున్నారు. ఇద్దరి మధ్య కోల్డ్ వార్‌తో నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు పూర్తిగా ఈ రెండు వర్గాలుగా చీలిపోయి, అంతర్గత కుమ్ములాటలకు పాల్పడుతున్నారు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×