E-Paper
Advertisement

Boy : వీధి కుక్కలకు మరో బాలుడి బలి.. కాజీపేటలో దారుణం..

Boy : వీధి కుక్కలకు మరో బాలుడి బలి.. కాజీపేటలో దారుణం..
Advertisement

Boy : తెలంగాణలో వీధి కుక్కలకు మరో బాలుడు బలయ్యాడు. హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వేక్వార్టర్స్‌లో 8 ఏళ్ల పసివాడు శునకాల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సునీత, మల్కాన్‌ దంపతులు అజ్మీర్‌ వెళ్లేందుకు తమ కుమారుడు చోటూతో కాజీపేట రైల్వేస్టేషన్‌కు వచ్చారు. వీరు సంచార జాతులవారు. ఆహారం వండుకునేందుకు రైల్వేస్టేషన్‌ పక్కనే ఉన్న పార్కుకు గురువారం రాత్రి వచ్చారు.

శుక్రవారం ఉదయం నిద్ర లేచిన తర్వాత బహిర్భూమికి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి చోటూ వెళ్లాడు. అక్కడే ఆరు వీధి కుక్కలున్నాయి. ఒక్కసారిగా ఆ కుక్కలు బాలుడిపై దాడి చేశాయి. చెట్టు కొమ్మకు దుస్తులు చిక్కుకోవడంతో చోటూ వాటి నుంచి తప్పించుకోలేపోయాడు. ఎటు కదల్లేక అక్కడే కింద పడిపోయాడు.

Advertisement

దాదాపు 15 నిమిషాలపాటు కుక్కలు బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన చోటూ అక్కడికక్కడే మృతిచెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు గుండెలవిసెలా రోదిస్తున్నారు.

రైల్వే క్వార్టర్స్‌లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు అంటున్నారు. వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. 4 రోజుల క్రితం ఓ బాలికపై కుక్కలు దాడి చేశాయని తెలిపారు. 10 రోజుల క్రితం ఓ రైల్వే ఉద్యోగిపైనా కుక్కలు దాడి చేశాయని అంటున్నారు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×