Bhimavaram: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కేసులో నిందితుడు శ్రీనివాస్ వీడియో వైరల్ అయింది. తన తల్లి, తమ్ముడు దెయ్యాల ని చెబుతున్నాడు. మనస్సులో ఏదనుకుంటే వారికి అది తెలిసిపోతోందంటున్నాడు. అందుకే ఇద్దరిని చంపేశానని చెబుతున్నాడు నిందితుడు. కత్తితో ఎంత పొడిచినా తెగడం లేదని.. వాళ్లద్దరి బాడీ స్ట్రాంగ్ అని నిందితుడు చెబుతున్న వీడియో కలకలం రేపుతోంది. కత్తితో కోసినా కూడా బాడీలు తెగకపోవడంతో తన చేయి నొప్పి చేస్తుందని చెబుతుండటం ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తుంది. అంతటితో ఆగని నిందితుడు శ్రీనివాస్.. తల్లి, తమ్ముడు బతుకుతారేమోనని చెప్పటం ఆందోళన కల్గిస్తుంది. తనకు తిండిపెట్టకుండా.. పిచ్చి పట్టిందంటూ తొమ్మిదేళ్ల నుంచి పీక్కు తింటున్నారంటున్నారు.