E-Paper
Advertisement

హైదరాబాద్‌లో ఘోరం.. మంటల్లో దగ్దమైన కారు, ఓ వ్యక్తి సజీవదహనం

హైదరాబాద్‌లో ఘోరం.. మంటల్లో దగ్దమైన కారు, ఓ వ్యక్తి సజీవదహనం
Advertisement

కారణాలు ఏంటో తెలీదు.. ఈ మధ్యకాలం కారులో మంటలు ఎగిసిపడుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. అలాంటి ఘటన నుంచి చాలామంది బయటపడిన సందర్భాలు ఉన్నాయి. మంటలకు కారు నుంచి బయటకు రాలేక ఓ వ్యక్తి సజీవ దహనమైన ఘటన తాజాగా హైదరాబాద్‌లో వెలుగు చూసింది.

హైదరాబాద్‌లో ఘోరం..మంటల్లో దగ్దమైన కారు

హైదరాబాద్‌లోని బౌరంపేట్ ప్రాంతంలో ఘోరం జరిగింది. ఏం జరిగిందో తెలీదుగానీ మంటల్లో ఓ కారు పూర్తిగా దగ్దమైంది. అందులో నుంచి బయటికి రాలేక ఓ వ్యక్తి అక్కడికక్కడే సజీవ దహనం అయ్యాడు. సొమవారం ఉదయం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేట్‌లోని  వజ్ర బిల్డర్స్ వెనకున్న పిసరి వారి పొలం దగ్గర ఈ ఘో రం జరిగింది. కారులో ఒక్కసారిగా మంటలు అంటుకొని కొద్దిసేపటికే దగ్దమైంది. దీంతో కారులో ఉన్న వ్యక్తి బయటికి రాలేక అందులోనే ప్రాణాలు కోల్పోయాడు.

కారు నుంచి బయటపడలేక ఓ వ్యక్తి సజీవ దహనం

Advertisement

దీని గురించి స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. మృతుడు బౌరంపేట్‌లో నివాసం ఉండే కార్తీక్ రాధాకృష్ణగా గుర్తించారు. ప్రమాదవశాత్తు కారుకి నిప్పు అంటుకుందా? కావాలని ఈ విధంగా చేశారా? లేకుంటే దీని వెనుక ఏదైనా కోణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసుల. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ALSO READ: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. తెలంగాణలో భారీ వర్ష సూచన, పలు జిల్లాలకు అలర్ట్

Advertisement

 

Related News

తెలంగాణ అసెంబ్లీ వద్ద హైడ్రామా.. నిరసనలు, ప్లకార్డులతో.. కేటీఆర్‌కు గాయాలు- సునీత కన్నీరు

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. తెలంగాణలో భారీ వర్ష సూచన, పలు జిల్లాలకు అలర్ట్

కేసీఆర్ దూకుడుతో కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్!

నర్సు హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మేజిస్టీరియల్ విచారణకు సీఎం ఆదేశం!

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బస్సు, మెట్రోకు ఒకే పాస్!

హోం మంత్రి మన రేవంతన్నే.. పబ్ రచ్చపై ఆర్ఎస్పీ సెటైర్లు !

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు సీఎం రేవంత్ ప్రవేశపెట్టే కీలక నివేదికలివే?

Big Stories

Advertisement
×