Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని ప్రభుత్వాదికారుల తెలిపారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎనిమిదో సెషన్లో రెండో సమావేశాలు జరగనున్నాయి. సభ ప్రారంభంకాగానే ప్రశ్నోత్తరాలు (క్వశ్చన్ హౌర్) జరగనుంది.
అయితే ఈ సారి సభ ముందుకు మూడు కీలక నివేదికలు పెట్టనున్నారు. తెలంగాణ సమగ్ర శిక్ష (TSS) 2024-25 ఆడిట్ నివేదికను సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటుగా ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PM SHRI) తెలంగాణ 2024-25 ఆడిట్ నివేదికను సభ ముందుకు తీసుకురానున్నారు. TSS, PM SHRI ఆడిట్ నివేదికలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మార్గదర్శకాల ప్రకారం సభలో ప్రభుత్వం ఉంచనుంది.
Also read: నకిలీ హిజ్రా మాఫియా పై డీజీపీ ఉక్కుపాదం.. సంచలన ఆదేశాలు జారీ!
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్కు సంబంధించిన ఐదు వార్షిక నివేదికలను సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నట్టు సమారం. దీంతో పాటుగా 2013-14 నుంచి 2017-18 వరకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ వార్షిక నివేదికలు సభ ముందు ప్రవేశ పెట్టనున్నారు. కంపెనీల చట్టం-2013లోని సెక్షన్ 395 ప్రకారం హైదరాబాద్ మెట్రో వార్షిక నివేదికల సమర్పణ చేయనున్నారు.
Also read: అదిరిపోయిన బిగ్ బాస్ 10 హౌస్.. మ్యాజిక్ కీతో ఆటను మలుపు తిప్పిన నాగార్జున!