E-Paper
Advertisement

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. తెలంగాణలో భారీ వర్ష సూచన, పలు జిల్లాలకు అలర్ట్

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. తెలంగాణలో భారీ వర్ష సూచన, పలు జిల్లాలకు అలర్ట్
Advertisement

Telangana Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి క్రమంగా  ప్రభావం చూపుతోంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అటు తెలంగాణలో భారీగా వర్షాలు పడనున్నాయి. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి

ఎల్‌నినో ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. వర్షం లేక సామాన్యులు, రైతులు అల్లాడిపోతున్నారు. పగలు-రాత్రిళ్లు వాతావరణ ఒకేలా ఉంది. రుతుపవనాలు తిరోగమనం నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఏపీ-తెలంగాణల్లోని వివిద ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Advertisement

హైదరాబాద్‌- అమరావతి వాతావరణ కేంద్రాలు విడుదల చేసిన తాజా సూచనల మేరకు.. తెలంగాణలో రాబోయే రెండు రోజులు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం తెల్లవారుజామున నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో అప్పుడే చినుకులు మొదలయ్యాయి. తెలంగాణలో మధ్యాహ్నం నుండి అక్కడక్కడా ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడనుంది. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి – భోంగీర్, మెదక్, సిద్దిపేట, జనగాం, కామారెడ్డి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్‌లో మధ్యాహ్నం, రాత్రి సమయంలో అక్కడక్కడ ఉరుములు మెరిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

తెలంగాణలో పలు జిల్లాలకు అలర్ట్.. మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు

అటు నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నారాయణపేట, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి – కొత్తగూడెం, మహబూబాబాద్ అంతటా రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్, హైదరాబాద్ సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇక హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి చినుకులు మొదలయ్యాయి. ఉదయం ఆఫీసులకు వెళ్లేవారు గొడుగులతో బయలుదేరారు. మధ్యాహ్నం నుండి రాత్రి వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని పేర్కొంది.

Advertisement

ALSO READ: కేసీఆర్ దూకుడుతో కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్!

అమరావతి వాతావరణ కేంద్రం చెప్పిన వివరాలు మేరకు.. ఉత్తర కోస్తాంధ్రా, యానాంలో ఉరుములు, మెరుపులు ఉండొచ్చని తెలిపింది. వర్షాలు పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం తెలియజేసింది. ఇక రాయలసీమలో వారం రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Related News

కేసీఆర్ దూకుడుతో కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్!

నర్సు హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మేజిస్టీరియల్ విచారణకు సీఎం ఆదేశం!

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బస్సు, మెట్రోకు ఒకే పాస్!

హోం మంత్రి మన రేవంతన్నే.. పబ్ రచ్చపై ఆర్ఎస్పీ సెటైర్లు !

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు సీఎం రేవంత్ ప్రవేశపెట్టే కీలక నివేదికలివే?

మీ కోడళ్లకు ఇలాగే జరిగితే ఊరుకుంటారా.. డీజీపీ పై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!

అసెంబ్లీ సమావేశాల వేళ రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×