BigTV English
Advertisement

Be Alert: హైదరాబాద్‌లో శృతి మించుతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు

Be Alert: హైదరాబాద్‌లో శృతి మించుతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు

Be Alert: హైదరాబాద్‌లో, ముఖ్యంగా హయత్‌నగర్, ఎల్బీనగర్, కర్మన్‌ఘాట్ పరిసర ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్‌ల ఆగడాలు శృతి మించుతున్నాయి. ఈ మూకలు చీకటి పడ్డాక ఒకేచోట చేరి మత్తు పదార్థాలు తీసుకుంటూ స్థానికులను భయపెడుతున్నాయి. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ విద్యాసంస్థలు, కాలనీల్లో గంజాయి వినియోగిస్తూ పాదచారులు, వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నారు.


శృతి మించుతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు
కత్తులు, తల్వార్లు వంటి ఆయుధాలను వాహనాల్లో దాచుకొని అర్ధరాత్రి సమయంలో నగరమంతా చక్కర్లు కొడుతూ భయాందోళనలు సృష్టిస్తున్నారు. ఇంటి నుంచి పారిపోయిన యువకులు, మాదకద్రవ్యాలకు బానిసైన వారు నిర్మానుష్య ప్రాంతాల్లో ఉంటూ గంజాయి ఏజెంట్లుగా మారుతున్నారు. గంజాయికి దగ్గరవుతూ విద్యార్థులు, యువకులు కూడా ఈ మూకల్లో చేరుతున్నారు. తమ జాడ తెలియకుండా వీధి దీపాలు పగలగొట్టి చీకటి సృష్టిస్తున్నారు.

హయత్‌నగర్‌-భాగ్యలతలో రూ.1000 విషయంలో తండ్రీకొడుకులను తీవ్రంగా కొట్టిన వైనం
తాజాగా హయత్‌నగర్-భాగ్యలత ప్రాంతంలో రూ.1000 విషయంలో తండ్రీకొడుకులను తీవ్రంగా కొట్టిన ఘటన జరిగింది. ఈ గంజాయి బ్యాచ్ ఎదిరించిన వారి ఇళ్లల్లోకి చొరబడి బెదిరించి, కారులో నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి దాడి చేస్తున్నారు. స్థానికులు భయంతో రాత్రి సమయంలో బయటకు రావట్లేదు.


రైల్వేస్టేషన్లలో కూడా వదలకుండా వికృత చేష్టలు..
ఈ మూకలు ఎంజీబీఎస్, జేమ్స్‌స్ట్రీట్, సంజీవయ్యపార్క్, చిక్కడపల్లి, ముషీరాబాద్, కూకట్‌పల్లి, మణికొండ, గోల్కోండ, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లలో కూడా వికృత చేష్టలు చేస్తున్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 2016-2017లో 21 గంజాయి కేసులు నమోదై, అందులో అందరినీ అరెస్టు చేసి రూ.4.5 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. భాగ్యలత కాలనీలో గురిజా సురేష్ వంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టి చర్యలు తీసుకున్నారు.

గంజాయి బ్యాచ్‌పై ఫిర్యాదు చేస్తే నోటీసులు ఇచ్చి పంపుతున్న పోలీసులు
పోలీసులు బృందం పర్యవేక్షిస్తున్నామని చెప్పినప్పటికీ, స్థానికులు ఫిర్యాదు చేస్తే కేవలం నోటీసులు ఇచ్చి పంపేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. తాజా ఘటనపై హయత్‌నగర్ పోలీసులు రెండు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనలో బాధితులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు నిందితులను పట్టుకోవటానికి సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలిస్తున్నారు.

Also Read: స్పీకర్ వద్దకు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

గంజాయి బ్యాచ్ ఆగడాలు నిర్మూలించాలని స్థానికుల ఆందోళన..
అయితే ఇలాంటి ఘటనలు ఇటీవల విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో కూడా బాగా జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో విజయవాడలో డెలివరీ బాయ్‌పై డబ్బులు డిమాండ్ చేసి దాడి చేశారు. హైదరాబాద్‌లోనూ గంజాయి స్మగ్లింగ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ గంజాయి బ్యాచ్ ఆగడాలు నిర్మూలించాలని స్థానికులు కోరుతున్నారు.

Related News

TG Govt Schools: గురుకుల, కేజీబీవీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పెండింగ్ బకాయిలు మొత్తం క్లియర్

Hydraa: రూ. 111 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా.. స్థానికులు హర్షం వ్యక్తం

Azharuddin: అజార్‌కు మంత్రి పదవి.. అందుకేనా!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో బీజేపీ పరిస్థితి ఏంటీ!

Fee reimbursement Scheme: ఫీజు రియంబర్స్‌మెంట్ వివాదం.. నవంబర్ 3 నుంచి ప్రైవేటు కళాశాలల బంద్?

Chamala Kiran Kumar Reddy: అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కకుండా బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్ర: ఎంపీ చామల

Heavy Rains: తెలంగాణపై మొంథా ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షం, రైతన్నలు జర జాగ్రత్త..!

Azharuddin Oath: రేపే మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు, ఎందుకంటే?

Big Stories

×