E-Paper
Advertisement

Hydraa: రూ. 111 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా.. స్థానికులు హర్షం వ్యక్తం

Hydraa: రూ. 111 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా.. స్థానికులు హర్షం వ్యక్తం
Advertisement

Hydraa: హైడ్రా.. హైదరాబాద్ ను రూపు రేఖలు మారుస్తోంది. హైడ్రా వచ్చాక వందల ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించి స్వాధీనం చేసుకుంటుంది. ముఖ్యం ఆక్రమణ దారుల్లో హైడ్రా పరుగులు పెట్టిస్తోంది. ఎక్కడ ఆక్రమణ ఉన్నా వెంటనే అక్కడ వాలిపోయి లెక్కలన్నీ సరిచేస్తోంది. హైడ్రా చేస్తున్న పనుల పట్ల భాగ్యనగర వాసుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల పక్కన ఉన్న భూములను ఆక్రమించుకున్న కబ్జాదారుల్లో వెన్నులో వణకుకు పుట్టిస్తోంది హైడ్రా.. తాజాగా రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలో రూ.111 కోట్ల విలువైన భూములను హైడ్రా గుర్తించి స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

⦿ రూ.111 కోట్ల విలువైన భూమి..

Advertisement

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్, బాలాపూర్ మండ‌లాల్లో 976 గ‌జాల పార్కుతో పాటు 1.28 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా గురువారం స్వాధీనం చేసుకుంది.. వీటి విలువ రూ. 111 కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని హైడ్రా అధికారులు అంచనా వేశారు. మైలార్‌దేవుప‌ల్లి విలేజ్‌లోని శాస్త్రీపురం కాల‌నీలో 976 గజాల పార్కు స్థ‌లం చుట్టూ గ‌తంలో మున్సిప‌ల్ అధికారులు ఫెన్సింగ్ వేశారు. త‌ప్పుడు డాక్యుమెంట్ల‌తో కొంత‌మంది పార్కు స్థ‌లాన్ని క‌బ్జా చేస్తున్నార‌ని అక్క‌డి నివాసితులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంది.

ALSO READ: CM Chandrababu Naidu: అందరూ చదువుకుంటూ పోతే ఎలా? చంద్రబాబుకు యువకుడి ప్రశ్న.. వీడియో వైరల్!

Advertisement

⦿ పార్కు స్థలం కబ్జాకు గురైందని ఫిర్యాదు..

ఆ వెంటనే బాలాపుర్ మండలంలో పార్కు స్థలాంలో హైడ్రా దిగింది. 1996లో వేసిన హుడా లే ఔట్‌లో పార్కు స్థ‌లం క‌బ్జా అయ్యింద‌ని ఫిర్యాదు చేశారు. వెంట‌నే స్పందించి ఆ స్థ‌లాన్ని హైడ్రా కాపాడింద‌ని స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. బాలాపూర్ మండ‌లం జిల్లేలుగూడ విలేజ్‌లో స‌ర్వే నంబ‌రు 76లోని 1.28 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిలో కూడా ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా గురువారం తొల‌గించింది.

⦿ స్థానికులు హర్షం వ్యక్తం..

కొంత‌మంది ఫేక్ ప‌ట్టాలు సృష్టించి ప్లాట్లుగా విక్ర‌యించ‌డంతో పాటు.. ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నారంటూ హైడ్రాకు ఫిర్యాదు అంద‌గానే ఈ చ‌ర్య‌లు తీసుకుంది. పార్కుతో పాటు.. ప్ర‌భుత్వ స్థ‌లం చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డుల‌ను ఏర్పాటు చేసింది. దీంతో హైడ్రా అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

ALSO READ: Kurnool Bus Fire: కర్నూలు బస్సు ప్రమాదంలో మూడో వాహనం ప్రమేయం.. పోలీసులకు కీలక ఆధారాలు

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×