BigTV English

Telangana Politics: స్పీకర్ వద్దకు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Telangana Politics: స్పీకర్ వద్దకు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఉత్కంఠ నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శికి తమ రిప్లై సమర్పించనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన మూడు రోజుల గడువు ఈరోజుతో ముగియనుంది.


2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. వీరు మార్చి 2024లో పార్టీ మార్పిడి చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ 10 మందిపై అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

జులై 31, 2025న సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. స్పీకర్ ఈ పిటిషన్లపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాలతో స్పీకర్ చర్యలు తీసుకున్నారు. ఆగస్టు చివరి వారంలో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు, వారి వివరణలు కోరారు.


సెప్టెంబర్ 11,12 తేదీల్లో 8 మంది ఎమ్మెల్యేలు తమ వివరణలు సమర్పించారు. వారు బీఆర్ఎస్‌కు విధేయులమని, కాంగ్రెస్‌లో చేరలేదని పేర్కొన్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల్), అరికపూడి గాంధీ (సెరిలింగంపల్లి), డాక్టర్ సంజయ్ (జగిత్యాల), గుడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్స్‌వాడ), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), కాలే యాదయ్య (చేవెళ్ల), తెల్లం వెంకటరావు (భద్రాచలం). మిగిలిన ఇద్దరు – కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్) – అదనపు సమయం కోరారు. వీరు కాంగ్రెస్‌లో చేరినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, ముందుగా వీరిని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

అయితే ఈ 10 మందిలో 9 మంది సెప్టెంబర్ 7న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిశారు. తమ భవిష్యత్ చర్యలు చర్చించారు. వారు కాంగ్రెస్‌లో చేరినట్లు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ధృవీకరించారు. ఎమ్మెల్యేల వివరణలను స్పీకర్ బీఆర్ఎస్‌కు పంపారు. ఆ వివరణలపై బీఆర్ఎస్ తమ అభ్యంతరాలు సమర్పించేందుకు మూడు రోజుల గడువు ఇచ్చారు. ఈ గడువు సెప్టెంబర్ 11, 12 నుంచి ప్రారంభమై, సెప్టెంబర్ 14తో ముగియనుంది.

Also Read: నాగార్జునసాగర్‌కు మరోసారి వరద ఉధృతి.. 26 గేట్ల ద్వారా నీటి విడుదల

బీఆర్ఎస్ లీగల్ సెల్ ఈ వివరణలను పరిశీలిస్తోంది. ఫోటోలు, వీడియోలు, న్యూస్ రిపోర్టులు వంటి ఆధారాలతో సమగ్ర రిప్లై తయారు చేస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులుకు ఈ రిప్లై సమర్పించనున్నారు. ఇది పెన్‌డ్రైవ్ రూపంలో ఉంటుందని సమాచారం. బీఆర్ఎస్ ఈ అభ్యంతరాల్లో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు, పార్టీ మారినట్లు ఆధారాలు చూపనుందని చెబుతున్నారు.

Related News

GHMC Rules: రోడ్డుపై చెత్త వేస్తే జైలు శిక్ష..హైదరాబాద్ వాసులకు GHMC అలర్ట్

Be Alert: హైదరాబాద్‌లో శృతి మించుతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు

Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్‌కు మరోసారి వరద ఉధృతి.. 26 గేట్ల ద్వారా నీటి విడుదల

CM Progress Report: రేవంత్ మార్క్.. తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు ఇవే..!

AP-Telangana Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో అలర్ట్, పిడుగులు పడే అవకాశం

Telangana Jobs Investments: తెలంగాణలో భారీ పెట్టుబడులు.. రాష్ట్రంలో ఎల్‌ఈడీ తయారీ యూనిట్.. 6000 ఉద్యోగాలు!

KTR: గ్రూప్-1 పోస్టులను రూ.1700 కోట్లకు అమ్ముకున్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×