Manikonda News: హైదరాబాద్ సిటీకి వచ్చే తాగునీటి పైపు లైన్లను వాటర్ విభాగం మరమ్మతులు చేస్తోంది. ఏం జరిగిందో తెలీదుగానీ అర్ధరాత్రి మణికొండలోని పలు అపార్టుమెంట్లను వాటర్ చుట్టుముట్టింది. అపార్టుమెంటు సెల్లార్లు ముగినిపోయాయి. అసలు ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
మణికొండని చుట్టుముట్టిన వాటర్
హైదరాబాద్ సిటీలోని మణికొండ ప్రాంతంలోని పలు కాలనీలను నీరు ముంచెత్తింది. అర్ధరాత్రి మణికొండలో భారీ పైప్లైన్ పగిలిపోయింది. దీంతో పలు కాలనీల్లోకి నీరు వచ్చి చేరింది. సింగూరు నుంచి హైదరాబాద్కు తాగునీటి పైప్ లైన్ అది. తెల్లవారుజామున పగిలిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో అపార్ట్మెంటు సెల్లార్లు నీటితో నిండిపోయాయి.
ఎటు చూసినా నీరు కనిపించడంతో అపార్టుమెంట్ వాసులు షాకయ్యారు. సెలార్లలోని వాహనాలు నీటిలో మునిగిపోయాయి. వాటర్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు, హైడ్రా సిబ్బంది, వాటర్ విభాగం అధికారులు అక్కడికి చేరుకున్నారు. మోటార్లను పెట్టి సెల్లారులోని వాటర్ని బయటకు పంపించే ప్రయత్నం చేశారు.
అర్ధరాత్రి పగిలిన వాటర్ పైపులైన్.. అపార్ట్మెంట్ సెల్లార్లలోకి వాటర్
నీటి కారణంగా ఆ ప్రాంతంలో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ఎంప్లాయిస్ కాలనీ, శివసాయి కాలనీల్లోని సెల్లార్లలోకి వరద చేరింది. దీంతో కార్లు, టూ వీలర్స్ నీటిలో చిక్కుకున్నాయి. నీరు ముంచెత్తడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమీపంలో పందెన్ వాగు ఉండడంతో నీరంతా అందులోకి చేరినట్టు తెలుస్తోంది.
నీరు జోరుకు సీసీరోడ్డు ధ్వంసమయ్యాయి. పైపులైన్ బ్లాస్ట్ కావడంతో సమీపంలోని అపార్టుమెంట్ సెలార్లలోకి వాటర్ చేరింది. ఆ ప్రాంతంలో ఎక్కడికక్కడ వాహనాలు నీట మునిగాయి. మణికొండ నుంచి షేక్పేట్కు వెళ్లే దారిలో రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి. ప్రస్తుతం ట్రాఫిక్ నార్మల్గా ఉంది, పైపులైన్కు మరమ్మత్తులు చేస్తున్నారు అధికారులు.