Jagtial: జగిత్యాల జిల్లాలో అర్థరాత్రి జరిగిన ఏసీబీ సోదాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐగా విధులు నిర్వహిస్తున్న గుండేటి రాము అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఏసీబీ అధికారులకు చిక్కారు. గతంలో ఆయన వేములవాడ ఎస్హెచ్ఓగా పనిచేసిన సమయంలో ఒక బెల్లం వ్యాపారి నుంచి పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేసి వసూలు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది.
ఈ అవినీతి భాగోతంలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు మధ్యవర్తిగా వ్యవహరించడం గమనార్హం. జక్కని వేణు అనే ఉపాధ్యాయుడు సీఐ రాముకు సహకరిస్తూ.. అక్రమంగా వచ్చిన డబ్బును తన బ్యాంకు ఖాతా ద్వారా సీఐ కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించినట్లు ఏసీబీ గుర్తించింది. వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, బ్యాంకు ట్రాన్సాక్షన్ల ఆధారంగా అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు.
జగిత్యాలలోని దరూర్ క్యాంపులో ఉన్న సీఐ నివాసంలో జరిపిన సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. అధికారులు సుమారు 20 లక్షల రూపాయల నగదును, భారీ ఎత్తున బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన ఏసీబీ బృందం వారిని కోర్టులో హాజరుపరిచింది. ప్రభుత్వ అధికారులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సామాన్యులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
Also Read: గన్నేరు పప్పు తిని ఎస్సై భార్య ఆత్మహత్య.. కారణం తెలిస్తే?
జగిత్యాల జిల్లాలో ఏసీబీ సోదాలు
కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ రాము అరెస్ట్
పెద్ద ఎత్తున నగలు, రూ.20 లక్షల నగదు స్వాధీనం
సీఐకి మీడియేటర్ గా ఉన్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు
బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్న అధికారులు
ACB raids in Jagtial district. Karimnagar Urban Excise CI Ramu… pic.twitter.com/g31YpbVrGu
— BIG TV Breaking News (@bigtvtelugu) March 18, 2026