E-Paper
Advertisement

Paper Leak: పాపం ఆ విద్యార్థి.. ఐదేళ్లు డిబార్.. ఇదేం న్యాయం సారు?

Paper Leak: పాపం ఆ విద్యార్థి.. ఐదేళ్లు డిబార్.. ఇదేం న్యాయం సారు?
Advertisement
exam students

Paper Leak: పాపం ఆ పిల్లాడు. చేయని తప్పుకు ఐదేళ్లు డిబార్ అయ్యాడు. ఇదేం న్యాయం సారు అంటూ డీఈవోను వేడుకుంటే.. అది అంతేపో అన్నాడు. పరీక్షలు రాయనీయకపోవడంతో ఆ విద్యార్థి ఏడుస్తున్నాడు. తల్లితో కలిసొచ్చి మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే…

టెన్త్ హిందీ పేపర్ లీకేజీ ఘటన తెలంగాణలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసుగా. ఏకంగా బండి సంజయే అరెస్ట్ అయ్యేంతలా. ఏ3 నిందితుడు.. పరీక్ష రాస్తున్న విద్యార్థి నుంచి బలవంతంగా పేపర్ లాక్కొని.. దాన్ని సెల్‌ఫోన్లో ఫోటోలు తీసి వైరల్ చేశాడు. ఆ తర్వాత రచ్చ తెలిసిందే. ఆ నిందితుడు ఎవరి నుంచైతే పేపర్ లాక్కున్నాడో.. ఆ విద్యార్థిని ఐదేళ్లు డిబార్ చేశారు అధికారులు. అతని పేపరే బయటకు వచ్చింది కాబట్టి.. అతని మూలంగానే ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు కాబట్టి.. నిన్ను డిబార్ చేస్తున్నాం పో అంటూ డీఈవో హుకూం జారీ చేశాడు. పదో తరగతి పరీక్షలు రాయకుండా ఆ స్టూడెంట్‌ను అధికారులు అడ్డుకున్నారు.

Advertisement

ఈ ఘటనలో తాను ఏ తప్పూ చేయలేదని, ఐదేళ్ల పాటు డిబార్‌ చేయడం అన్యాయమని బాధిత విద్యార్థి బోరున విలపించాడు. హాల్‌టికెట్ తీసుకొని ఓ పత్రంపై సంతకం చేయించుకున్నారని చెబుతున్నాడు. తాన మానాన తాను ఎగ్జామ్ రాస్తుంటే.. గోడ మీది నుంచి వచ్చిన ఒకడు.. తనను చంపుతానని బెదిరించి ప్రశ్నాపత్రం లాక్కున్నాడని.. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదంటూ ఆ పిల్లాడు మొత్తుకుంటున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ తల్లితో కలిసి.. పరీక్ష హాల్‌కు వచ్చిన అధికారులందరినీ వేడుకుంటున్నాడు.

ఈ అధికారులున్నారే.. పేపర్ లీక్ కాకుండా అడ్డుకోలేరు.. బయటి వ్యక్తి గోడెక్కి గదిలో ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థి నుంచి పేపర్ లాక్కుంటే ఆపలేకపోయారు.. అమాయకుడైన ఆ పిల్లాడిని మాత్రం ఐదేళ్లు డిబార్ చేసి తమ అధికార బలాన్ని చాటుకున్నారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? ఆ విద్యార్థికి జరిగిన నష్టాన్ని తీర్చేదెవరు? పోయిన ఎగ్జామ్ మళ్లీ తిరిగి వస్తుందా? ఆ స్టూడెంట్ భవిష్యత్తు ఏంకాను? ఈ బాధలో అతనేమైనా చేసుకుంటే..? అందుకు బాధ్యులు ఎవరు? అధికారులారా.. మీ తీరు సిగ్గు సిగ్గు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×