E-Paper
Advertisement

బేకరీ ఐటమ్స్ ముసుగులో విషపు దందా.. ఇవి తిన్నారో ఇక అంతే..?

బేకరీ ఐటమ్స్ ముసుగులో విషపు దందా.. ఇవి తిన్నారో ఇక అంతే..?
Advertisement

Adulterated Snacks: స్వేచ్ఛ బ్యూరో: చిన్నపిల్లలు ఇష్టంగా తినే స్నాక్స్​ ను కల్తీ చేస్తున్న వారి గుట్టును పోలీసులు రట్టు చేశారు. పక్కాగా సేకరించిన సమాచారం వేర్వేరు తయారీ కేంద్రాలపై బుధవారం దాడులు జరిపి 2 లక్షల రూపాయల విలువ చేసే స్నాక్స్​ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితులను అరెస్ట్​ చేశారు. రాజేంద్రనగర్​ జోన్​ డీసీపీ ఎస్​.శ్రీనివాస్​ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియన్​ బేకరీ అండ్ స్వీట్ హౌస్..

సత్వాజీ అనే వ్యక్తి కాటేదాన్​ ప్రాంతంలో మారుతి ఫుడ్స్ పేర స్నాక్స్​ తయారీ కేంద్రాన్ని నడిపిస్తున్నాడు. కుర్ కురే, పోలో రింగ్స్​ ను తయారు చేసి హైదరాబాద్​ లోని వేర్వేరు కిరాణా షాపులకు సప్లయ్​ చేస్తున్నాడు. ఇక, అతర్​ రహమాన్​ అనే వ్యక్తి ఇండియన్​ బేకరీ అండ్ స్వీట్ హౌస్ పేర దందా చేస్తూ వేర్వేరు మిఠాయిలు, బేకరీ వస్తువులు తయారు చేస్తూ మార్కెటింగ్​ చేస్తున్నాడు. లక్ష్మీగూడలోని బృందావన్​ కాలనీలో కృష్ణ రాణిదాస్​ అనే వ్యక్తి కృష్ణ ఫుడ్​ ప్రొడక్ట్స్​ పేర మిక్చర్​ తదితర తినుబండారాలను తయారు చేసి వేర్వేరు దుకాణాలను పంపిస్తున్నాడు.

Advertisement

Also Read: Salary tips: జీతం వచ్చిన వెంటనే ఇలా చేస్తే డబ్బు కొరత ఉండదు

రసాయనాలు ఉపయోగిస్తూ స్నాక్స్..

ఇదే ప్రాంతంలో బల్వంత్​ రావు బీఎస్​ ఫుడ్​ ప్రొడక్ట్స్ అన్న కేంద్రాన్ని నిర్వహిస్తూ మీల్ మేకర్​, నల్లీ పాపడ్ లను తయారు చేసి అమ్ముతున్నాడు. అయితే, ఈ నాలుగు కేంద్రాల్లో నాసిరకం నూనె, ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగిస్తూ స్నాక్స్ తయారు చేస్తున్నట్టు అందిన సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. స్నాక్స్ శాంపిళ్లు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్​ కు పంపించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Advertisement

Also Read: సింహం గుర్తుతో కవిత కొత్త పార్టీ.. ఇక గులాబీ బాస్‌కు చెక్ పెట్టినట్లేనా?..!

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×