E-Paper
Advertisement

చిట్టీల పేరిట భారీ మోసం.. అమీన్‌పూర్‌లో రూ.2 కోట్లతో రాత్రికి రాత్రే దంపతులు పరార్!

చిట్టీల పేరిట భారీ మోసం.. అమీన్‌పూర్‌లో రూ.2 కోట్లతో రాత్రికి రాత్రే దంపతులు పరార్!
Advertisement

Chit Fraud: పరిచయం ఉన్నవారే కదా అని నమ్మి చిట్టీల రూపంలో కష్టపడి సంపాదించిన డబ్బులు దాచుకున్నారు. చివరికి కోట్లతో పరారై ఊహించని షాక్ ఇచ్చారు ఓ దంపతులు. రూ. 2 కోట్లతో పరారైన ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అమీన్‌పూర్ పరిధిలోని బీఎస్‌ఆర్ కాలనీలో శిరీష, సాంబశివరావు అనే దంపతులు నివాసముంటున్నారు. స్థానికులతో సన్నిహితంగా ఉంటూ వారి నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్నారు. పలువురి వద్ద నుంచి చిట్టీల పేరిట భారీగా డబ్బులు వసూలు చేశారు. నెలనెలా క్రమం తప్పకుండా వాయిదాలు కట్టించుకున్నారు. తీరా చిట్టీల గడువు ముగిసిన తర్వాత బాధితులకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చారు.

Advertisement

డబ్బుల కోసం బాధితుల నుంచి ఒత్తిడి ఎక్కువ అయ్యింది. దాంతో ఆ దంపతులు రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి ఎవరికీ కనిపించకుండా పరారయ్యారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న అమీన్‌పూర్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పరారైన దంపతులను ముమ్మారం గాలిస్తున్నారు.

Also Read: గ్యాస్ పేలి తండ్రితో పాటు ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు.. కాపాడిన 108 సిబ్బంది!

Tags

Related News

కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో భూముల రచ్చ.. 388 ఎకరాలు VS 933 ఎకరాలు

ఇంట్లోనే 30 ఏళ్లుగా పెరుగుతున్న పుట్ట.. భయంతో వణుకుతున్న వృద్ధురాలు!

అటెండర్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.. ఇద్దరు కేటుగాళ్ల అరెస్ట్!

కుంభమేళా రేంజ్‌లో గోదావరి పుష్కరాలు.. రేవంత్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!

48 కిలోల పంచలోహాలు, 24 క్యారెట్ల బంగారం పూత? బేగంబజార్ గణనాథుడిపై పోలీసుల క్లారిటీ!

బీసీ కుల గణనపై కేంద్రం కుట్ర.. కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం

నా భూమిలో చిన్న తప్పున్నా 13 ఎకరాలు రాసిచ్చేస్తా! సీఎం రేవంత్‌కు హరీశ్ రావు సవాల్

వైష్ణవి భర్త హరిబాబు హత్యపై సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ, సంతోష్ ‘రివేంజ్’ ఏం చెబుతోంది?

Big Stories

Advertisement
×