E-Paper
Advertisement

Amit shah: అమిత్ షా టూర్ షెడ్యూల్ ఇదే.. టైమ్ టు టైమ్ ఫుల్ డీటైల్స్..

Amit shah: అమిత్ షా టూర్ షెడ్యూల్ ఇదే.. టైమ్ టు టైమ్ ఫుల్ డీటైల్స్..
Advertisement
amit shah

Amit shah telangana tour(Political news in telangana): కర్ణాటకలో ఓటమి తర్వాత కాస్త కామ్ అయిన కమలం నేతల్లో అమిత్ షా టూర్ జోష్ నింపనుంది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అంటూ చెప్పుకొస్తున్న బీజేపీ నేతలు.. కేంద్ర హోంమంత్రి టూర్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అసలెలాంటి బలం లేని జిల్లాలో అమిత్ షా పర్యటనతో పార్టీకి ఎలాంటి మైలేజ్ వస్తుంది..? తెలంగాణ బీజేపీకి ఖమ్మం మీటింగ్.. టర్నింగ్ పాయింట్ అవుతుందా..? మీటింగ్ కు ముందు అమిత్ షా కలవబోయే స్పెషల్ పర్సనాలిటీస్ ఎవరు..?

కర్ణాటకలో పార్టీ ఓటమి కావచ్చు.. లేదా రాష్ట్ర నాయకత్వంలో మార్పు ఉండవచ్చనే ఊహాగానాలు కావచ్చు.. ఏదైతేనేం, గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీ వ్యవహారాలు కాస్త నిస్తేజంగా కొనసాగుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన.. నాయకత్వానికి సరికొత్త ఊపిరిపోస్తుందనే భావనలో ఉంది. ఈ క్రమంలో కర్ణాటక ఫలితాల తర్వాత.. తొలిసారిగా తెలంగాణలో అమిత్ షా పాల్గొనబోయే ఖమ్మం సభను.. విజయవంతం చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది.

Advertisement

ఈ నెల 15 న జరగనున్న ఖమ్మం సభ కోసం అమిత్ షా బుధవారం అర్ధరాత్రి శంషాబాద్ కు చేరుకుంటారు. గురువారం ఉదయం సంచలన దర్శకుడు రాజమౌళీతో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలా 45 నిమిషాల నుంచి 12 గంటలా 15 నిమిషాల వరకు జరగనున్న ఈ భేటీ.. రాజమౌళీ నివాసంలో జరగనుంది. అయితే ఈ భేటీలో ఇంకా ఎవరెవరు హాజరవుతారు..? ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయి..? అన్న అంశాలు ఆసక్తిగా మారాయి.

ఆ తర్వాత 12 గంటల 45 నిమిషాలకు శంషాబాద్ జేడీ కన్వెన్షన్ లో పూర్వ కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలతో సమావేశం అవుతారు. సాయంత్రం 4 గంటల నుంచి 4 గంటలా 40 నిమిషాల వరకు భద్రాచలం శ్రీ సీతారాచంద్రస్వామి వారిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత 5 గంటలా 40 నిమిషాల నుంచి 5 గంటలా 55 నిమిషాల వరకు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు.

Advertisement

రాత్రి 6 గంటల నుంచి 7 గంటల వరకు ఖమ్మం బహిరంగ సభలో పాల్గొంటారు. తరలివచ్చిన ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రి 7 గంటలా 10 నిమిషాల నుంచి 7 గంటలా 40 నిమిషాల వరకు ఖమ్మం గెస్ట్ హౌజ్ లో రెస్ట్ తీసుకోనున్న అమిత్ షా.. రాత్రి 7 గంటలా 40 నిమిషాలకు ఖమ్మం నుంచి విజయవాడకు వెళ్లనున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు విజయవాడ నుంచి నేరుగా గుజరాత్ కు వెళ్తారు.

ఖమ్మం మీటింగ్ కోసం స్టేట్ బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సుమారు లక్ష మందితో సభ నిర్వహించాలని యోచిస్తుంది. అందుకు తగ్గట్లు ప్రజలను తరలించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తోంది.

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×