Jnana Sai Mandir: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడిమల్కాపురం (అంజనీపురం) గ్రామంలో శ్రీ జ్ఞాన సాయి మందిర 18వ వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో విజయవంతంగా ముగిశాయి. 2026 మార్చి 12వ తేదీ గురువారం నుండి మార్చి 14వ తేదీ శనివారం వరకు మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు వైఖాన శాస్త్రానుసారంగా శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు హైదరాబాద్కు చెందిన ట్రాన్స్పసిఫిక్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (TRANSPACIFIC IMMIGRATION SERVICES) ప్రచురణకర్తలుగా వ్యవహరించి తమ వంతు సహకారాన్ని అందించారు.
ఈ వార్షికోత్సవ వేడుకలకు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి నలమాద ఉత్తమ్ పద్మావతి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారు బాబా వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్చి 12న ప్రారంభమైన వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అంజనీ సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. వెంకట్ రాజు, సర్పంచ్ పోల్నెడి నర్సమ్మ తదితర ప్రముఖులు పాల్గొని వేడుకల నిర్వహణను అభినందించారు. ఈ ఉత్సవాల విజయవంతంలో నాగేందర్ రెడ్డి, సమత దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు అకుంఠిత దీక్షతో శ్రమించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.