E-Paper
Advertisement

South Central Railway: ఏపీ, తెలంగాణలో వర్షాలు.. 21 రైళ్లు రద్దు.. 10 ట్రైన్స్ దారి మళ్లించిన సౌత్ సెంట్రల్ రైల్వే

South Central Railway: ఏపీ, తెలంగాణలో వర్షాలు.. 21 రైళ్లు రద్దు.. 10 ట్రైన్స్ దారి మళ్లించిన సౌత్ సెంట్రల్ రైల్వే

South Central Railway:  ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణమధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. మొత్తం 21 రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరో 10 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లుగా పేర్కొంది. విశాఖపట్నం నుంచి కడప వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌‌ను రద్దు చేశారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను భీమవరం మీదుగా దారి మళ్లించారు.

గడిచిన మూడురోజులుగా భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. దీంతో రవాణా అస్తవ్యస్తంగా మారింది. వర్షాలకు పలుచోట్ల రైల్వే ట్రాక్ దెబ్బ తిన్న నేపథ్యంలో 21 రైళ్లను రద్దు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. మరో 10 రైళ్లను దారి మళ్లించింది.

వర్షాల గురించి సమాచారం అందుకున్న సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు, సికింద్రాబాద్‌లోని కంట్రోల్ రూమ్ నుంచి రైళ్ల కార్యకలాపాల పునరుద్ధరణ, ఇతర భద్రతా అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ట్రాక్స్ ఎక్కడైనా డ్యామేజ్ అయ్యాయా? అనే దానిపై దిగువస్థాయి సిబ్బంది నుంచి సమాచారం సేకరిస్తున్నారు.

ALSO READ: తెలంగాణ-ఏపీ మధ్య రాకపోకలు బంద్..ప్రయాణాలు మానుకోవాలని విజ్ణప్తి

తెలంగాణలోని కురిసిన భారీ వర్షానికి మహబూబాబాద్ వద్ద కేసముద్రం రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. ఆ ప్రదేశంలో పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వర్షాల ధాటికి రద్దయిన రైళ్ల జాబితాలో కాకినాడ- లింగంపల్లి, సికింద్రాబాద్-గూడూరు, బీదర్-మచిలిపట్నం, మచిలీపట్నం-బీదర్, విజయవాడ-సికింద్రాబాద్, విశాఖపట్నం- సికింద్రాబాద్, చెన్నై- న్యూఢిల్లీ, న్యూఢిల్లీ- చెన్నై వంటి రైళ్లు ఉన్నాయి.

దారి మళ్లించిన రైళ్ల జాబితాలో 10 రైళ్లు ఉన్నాయి. వాటిలో తిరుపతి- సికింద్రాబాద్, బెంగుళూరు-పాటలీపుత్ర, విశాఖపట్నం-న్యూఢిల్లీ, విశాఖ-ముంబై, బీదర్-మధురై వంటి రైళ్ల ఉన్నాయి. అదనపు సమాచారం కోసం రైల్వే విభాగం, హెల్ప్ లైన్ల నెంబర్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్-27781500, వరంగల్-2782751, కాజీపేట-27782660, ఖమ్మం-2782885 నెంబర్లను సంప్రదించవచ్చు.

మరోవైపు హైదరాబాద్-విజయవాడ మార్గంలోని జాతీయ రహదారిపై పలుచోట్ల వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ ఆర్టీసీ దాదాపు 500 బస్సులు రద్దు చేసినట్టు తెలుస్తోంది. రద్దయిన వాటిలో ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన బస్సులున్నాయి.

 

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×