E-Paper
Advertisement

BRS : అంతా భ్రాంతియేనా.. జీవితాన వెలుగింతేనా.. ఆశా నిరాశేనా..?

BRS : అంతా భ్రాంతియేనా.. జీవితాన వెలుగింతేనా.. ఆశా నిరాశేనా..?
Advertisement

BRS : దేశవ్యాప్తంగా తమ పార్టీని విస్తరించాలని భావించిన కేసీఆర్‌కు ఏపీలో గట్టి షాక్ తగిలేలా ఉంది. ఏపీలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో పవన్ కళ్యాణ్‌తో తోట భేటీ కానున్నట్టు తెలుస్తోంది.

ఆయన గుంటూరు పశ్చిమ టిక్కెట్ ఆశిస్తున్నారని ప్రచారం జరుతుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున గుంటూరు పార్లమెంటుకు, 2019 ఎన్నికల్లో జనసేన తరఫున గుంటూరు పశ్చిమ అసెంబ్లీకి ఆయన పోటీ చేశారు. పొత్తులో బాగంగా టీడీపీ కూడా జనసేనకు గుంటూరు పశ్చిమ టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉంది. గుంటూరు పశ్చిమ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఉన్న రజనీకి చెక్ పెట్టాలంటే తోట అయితేనే సరైన వ్యక్తి అని జనసేన భావిస్తోంది.

Advertisement

అటు.. మరో కీలక నేత రావెల కిశోర్ బాబు వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన వైసీపీ కీలక నేతలతో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈనెల 30న రావెల జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతే కాదు.. మిగిలిన నేతల కూడా వేరే పార్టీలు చూసుకుంటున్నారు. ఇదే జరిగితే ఇక బీఆర్ఎస్ దుకాణం ఏపీలో బంధ్ అయినట్టేనని ప్రచారం జరుగుతోంది.

Related News

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

Big Stories

Advertisement
×