E-Paper
Advertisement

BRS : అంతా భ్రాంతియేనా.. జీవితాన వెలుగింతేనా.. ఆశా నిరాశేనా..?

BRS : అంతా భ్రాంతియేనా.. జీవితాన వెలుగింతేనా.. ఆశా నిరాశేనా..?
Advertisement

BRS : దేశవ్యాప్తంగా తమ పార్టీని విస్తరించాలని భావించిన కేసీఆర్‌కు ఏపీలో గట్టి షాక్ తగిలేలా ఉంది. ఏపీలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో పవన్ కళ్యాణ్‌తో తోట భేటీ కానున్నట్టు తెలుస్తోంది.

ఆయన గుంటూరు పశ్చిమ టిక్కెట్ ఆశిస్తున్నారని ప్రచారం జరుతుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున గుంటూరు పార్లమెంటుకు, 2019 ఎన్నికల్లో జనసేన తరఫున గుంటూరు పశ్చిమ అసెంబ్లీకి ఆయన పోటీ చేశారు. పొత్తులో బాగంగా టీడీపీ కూడా జనసేనకు గుంటూరు పశ్చిమ టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉంది. గుంటూరు పశ్చిమ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఉన్న రజనీకి చెక్ పెట్టాలంటే తోట అయితేనే సరైన వ్యక్తి అని జనసేన భావిస్తోంది.

Advertisement

అటు.. మరో కీలక నేత రావెల కిశోర్ బాబు వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన వైసీపీ కీలక నేతలతో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈనెల 30న రావెల జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతే కాదు.. మిగిలిన నేతల కూడా వేరే పార్టీలు చూసుకుంటున్నారు. ఇదే జరిగితే ఇక బీఆర్ఎస్ దుకాణం ఏపీలో బంధ్ అయినట్టేనని ప్రచారం జరుగుతోంది.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×