E-Paper
Advertisement

Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..

Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..

Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజూమున వేగంగా దూసుకెళ్లిన కారు సిమెంట్ లోడ్‌తో వెళ్తోన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తోన్న ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ దారుణ ఘటన తెన్‌కాసి జిల్లాలో చోటు చేసుకుంది.

తెన్కాసి జిల్లా పులియంగుడికి చెందిన ఆరుగురు స్నేహితులు నిన్న రాత్రి కారులో కుర్దాలం వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో పులియంగుడి సమీపంలోని పున్నయ్యపురం వద్ద వీరి కారును ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కార్తీక్, వేల్ మనోజ్ పులియంగుడికి చెందిన పోతిరాజ్, సుబ్రమణ్యం, మనో సుబ్రమణ్యం ప్రమాదంలో మృతి చెందినట్లుగా గుర్తించారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తెన్‌కాసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×