E-Paper
Advertisement

Hospital : ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. బలవంతంగా నార్మల్ డెలివరీ .. శిశువు మృతి..

Hospital : ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. బలవంతంగా నార్మల్ డెలివరీ .. శిశువు మృతి..
Advertisement

Hospital : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. నిండు గర్భిణికి బలవంతంగా కాన్పు చేశారని, దీంతో శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పదర మండల కేంద్రానికి చెందిన చాట్ల మంజుల కాన్పు కోసం ఈ నెల 25న అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. సహజ ప్రసవం చేసేందుకు వైద్యురాలు, సిబ్బంది.. గర్భిణిపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. చేతులను పట్టుకొని కడుపుపై కొడుతూ బలవంతంగా ప్రసవం చేశారని బాధితరాలు కుటుంబ సభ్యులు అంటున్నారు. పుట్టిన సమయానికే స్పృహ కోల్పోయిన శిశువును మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ శిశువుని పరిశీలించిన వైద్యులు.. అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు.

బాధితురాలు కుటుంబ సభ్యులు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రసవం చేసిన వైద్యురాలు, సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శిశువు మృతదేహంతో వైద్యురాలి ఇంటి ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Advertisement

విషయం తెలుసుకొని ఆస్పత్రికి చేరుకున్న సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణను నిలదీశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డాక్టర్‌ కృష్ణ హామీ ఇచ్చారు.

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×