E-Paper
Advertisement

Hospital : ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. బలవంతంగా నార్మల్ డెలివరీ .. శిశువు మృతి..

Hospital : ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. బలవంతంగా నార్మల్ డెలివరీ .. శిశువు మృతి..

Hospital : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. నిండు గర్భిణికి బలవంతంగా కాన్పు చేశారని, దీంతో శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పదర మండల కేంద్రానికి చెందిన చాట్ల మంజుల కాన్పు కోసం ఈ నెల 25న అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. సహజ ప్రసవం చేసేందుకు వైద్యురాలు, సిబ్బంది.. గర్భిణిపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. చేతులను పట్టుకొని కడుపుపై కొడుతూ బలవంతంగా ప్రసవం చేశారని బాధితరాలు కుటుంబ సభ్యులు అంటున్నారు. పుట్టిన సమయానికే స్పృహ కోల్పోయిన శిశువును మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ శిశువుని పరిశీలించిన వైద్యులు.. అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు.

బాధితురాలు కుటుంబ సభ్యులు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రసవం చేసిన వైద్యురాలు, సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శిశువు మృతదేహంతో వైద్యురాలి ఇంటి ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

విషయం తెలుసుకొని ఆస్పత్రికి చేరుకున్న సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణను నిలదీశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డాక్టర్‌ కృష్ణ హామీ ఇచ్చారు.

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×