Big Stories

Hospital : ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. బలవంతంగా నార్మల్ డెలివరీ .. శిశువు మృతి..

Hospital : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. నిండు గర్భిణికి బలవంతంగా కాన్పు చేశారని, దీంతో శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పదర మండల కేంద్రానికి చెందిన చాట్ల మంజుల కాన్పు కోసం ఈ నెల 25న అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. సహజ ప్రసవం చేసేందుకు వైద్యురాలు, సిబ్బంది.. గర్భిణిపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. చేతులను పట్టుకొని కడుపుపై కొడుతూ బలవంతంగా ప్రసవం చేశారని బాధితరాలు కుటుంబ సభ్యులు అంటున్నారు. పుట్టిన సమయానికే స్పృహ కోల్పోయిన శిశువును మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ శిశువుని పరిశీలించిన వైద్యులు.. అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు.

- Advertisement -

బాధితురాలు కుటుంబ సభ్యులు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రసవం చేసిన వైద్యురాలు, సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శిశువు మృతదేహంతో వైద్యురాలి ఇంటి ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

విషయం తెలుసుకొని ఆస్పత్రికి చేరుకున్న సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణను నిలదీశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డాక్టర్‌ కృష్ణ హామీ ఇచ్చారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News