BigTV English

Bandi Sanjay on Karimnagar Development: ఆ బాధ్యత నాదే.. అవసరమైతే పొన్నం, గంగులతోనూ మాట్లాడుతా: బండి సంజయ్

Bandi Sanjay on Karimnagar Development: ఆ బాధ్యత నాదే.. అవసరమైతే పొన్నం, గంగులతోనూ మాట్లాడుతా: బండి సంజయ్

Bandi Sanjay Assurance on Karimnagar Development: కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన జన్మభూమి అయిన కరీంనగర్ గడ్డ రుణం తీర్చుకుంటానని చెప్పారు. ఆయనను ఆదివారం కరీంనగర్ లో కార్పొరేటర్లు సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కరీంనగర్ కు నిధులు తెచ్చే బాధ్యత తనదే అంటూ హామీ ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని అద్దంలా తీర్చిదిద్దుతానంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. ఇక్కడి అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నేత గంగుల కమాలకర్ తో కూడా చర్చిస్తానంటూ చెప్పుకొచ్చారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా మిగిలిన నిధులను త్వరలోనే మంజూరు చేయిస్తానన్నారు.


తాను కార్పొరేటర్ నుంచి కేంద్రమంత్రి స్థాయికి వచ్చానని అన్నారు. తాను బతికినన్నాళ్లు ఒకే పార్టీ, ఒకే సిద్ధాతంతో పనిచేస్తానన్నారు. ధర్మ రక్షణే ధ్యేయంగా, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తానని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అందుకోసం ఎందైకానా పోరాడతాని ఆయన పునరుద్ఘాటించారు. కరీంనగర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా పనులు చేస్తానని బండి సంజయ్ ప్రకటించారు.

కేంద్రమంత్రిగా కరీంనగర్ కు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. పదవి ఉన్నా లేకున్నా మంచి పనులు చేస్తానని చెప్పారు. తాను వందేళ్లు బతకాలని కోరుకోవడంలేదని.. బతికినన్నాళ్లు ధైర్యంగా, నిజాయితీగా ఉండి పోరాడతానన్నారు. ప్రజల మనసుల్లో నిలిచిపోయేలా పనిచేస్తానని అన్నారు. గతంలో గుండెపోటు రావడంతో ఎన్ని షాక్ లు ఇచ్చినా స్పృహ రాకపోవడంతో చనిపోయాని డాక్టర్లు ప్రకటించారని, కానీ, మహాశక్తి అమ్మవారి దయ వల్ల బతికానన్నారు. తనకు లభించిన ఈ పునర్జన్మను ప్రజలకే అంకితం చేస్తానంటూ సంజయ్ స్పష్టం చేశారు. కేంద్రమంత్రి పదవిని బాధ్యతగా భావిస్తున్నానన్నారు.


Also Read: హరీశ్ రావు బీజేపీలోకి రావొచ్చు.. కానీ: బండి సంజయ్

‘నేను ధర్మం కోసం, ప్రజల కోసం ఎంతదాకైనా పోరాడుతా. నాపై 109 కేసులు పెట్టినా భయపడలేదు. కేసులు పెట్టి నన్ను క్రిమినల్ గా మార్చాలనుకుంటే.. ప్రధానమంత్రి మోదీ, అమిత్ షాలు హోంశాఖ సహాయ మంత్రిని చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా 150 రోజులపాటు మండుటెండులో, చలిలో, వానలో 1600 కిలో మీటర్ల దూరం పాదయాత్ర చేశాను. ఎంత ఇబ్బంది పెట్టినా, హేళన చేసినా, ఆఫీస్ పై దాడులు చేసినా, అర్ధరాత్రి ఇంట్లోకి పోలీసులు చొరబడి లాక్కెళ్లినా, అరెస్టులు చేసినా, జైల్లో వేసినా నేను ఏనాడు భయపడలేదు. జనం కోసం పోరాడాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తే గుర్తింపు దానంతటే అదే వస్తుంది’ అని బండి సంజయ్ అన్నారు.

‘భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద నా భార్యను చంపుతామన్నారు. కొడుకులను కిడ్నాప్ చేస్తామన్నారు. అయినా నేను ఏరోజు భయపడలేదు. ధర్మం కోసం చావడానికైనా సిద్ధం. వెనుకాడే ప్రసక్తే లేదు. కేంద్ర హోంశాఖ నా పూర్వజన్మ సుకృతం. కేంద్రమంత్రిగా రాబోయే ఐదేళ్లపాటు అధిక నిధులు తీసుకువచ్చే అవకాశం వచ్చింది’ అంటూ కేంద్రమంత్రి పేర్కొన్నారు.

Related News

BC Reservations: హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా

Weather Update: రాష్ట్రంలో 4 రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో పిడుగుల వర్షం, అత్యవసరం అయితే తప్ప..?

Cough Syrups: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ రెండు దగ్గు మందులు బ్యాన్

Farmer Scheme: వ్యవసాయ భూమి ఉంటే చాలు.. ఈజీగా రూ.50వేలు పొందవచ్చు.. అప్లికేషన్ విధానం ఇదే..

Heavy Rains: భారీ వర్షాలు.. మరో మూడు రోజులు దంచుడే దంచుడు..

Ponnam And Adluri Comments: ముగిసిన మంత్రుల వివాదం.. అడ్లూరికి క్షమాపణ చెప్పిన పొన్నం..

Telangana Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు.. ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే

Fire Accident: నల్గొండ జిల్లా హాలియా SBIలో అగ్నిప్రమాదం..

Big Stories

×