E-Paper
Advertisement

Jawan Died in Manipur: మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత.. సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా ఒక్కసారిగా..

Jawan Died in Manipur: మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత.. సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా ఒక్కసారిగా..

CRPF Jawan Died and 3 Injured in Search Operation in Manipur: మణిపూర్ రాష్ట్రంలోని జిరిబామ్ జిల్లాల్లో ఆదివారం నిర్వహిస్తున్న జాయింట్ పెట్రోలింగ్ పై అనుమానిత ఉగ్రవాదులు మెరుపుదాడులు చేశారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ జవాన్ మృతిచెందగా.. ఇద్దరు మణిపూర్ పోలీస్ అధికారులకు గాయాలయ్యాయి. అదేవిధంగా ముగ్గురు భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మోర్ బంగ్ గ్రామంలో దాడి జరిగినట్లు పేర్కొన్నారు. అక్కడ ఉగ్రవాదులు పెట్రోలింగ్ పార్టీపై కొండ ప్రాంతం నుంచి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

సీఆర్పీఎఫ్ సైనికులు అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో వారి వాహనంపై ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది తిరిగి కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు అడవిలోకి పారిపోయారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతుంది. ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు.

Also Read: 50 ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీపై చర్చ అవసరమా ? : చిదంబరం

గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, భద్రతా బలగాలపై దాడి గత 5 వారాల్లో ఇది రెండవది. జూన్ 10న కాంగ్ పోక్పి జిల్లాలో సీఎం ఎన్ బీరెన్ సింగ్ ముందస్తు భద్రతా కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. జిరిబామ్ జిల్లాలో జూన్ 6న రైతు సోయిబామ్ శరత్ కుమార్ సింగ్ హత్యతో సహా ఇటీవల అక్కడ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×